శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో మొత్తం 321 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన వెనుక ఐసీస్ ప్రమేయం ఉందని మొదటి నుంచి శ్రీలంక భద్రతాధికారులు అనుమానం వ్యక్తం చేయగా, ఆ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఐసీస్ సంస్థ తాజాగా పేర్కొంది. అయితే మానవబాంబు తో ఈ నరమేధానికి పాల్పడ్డారని తెలిపే కీలక ఆధారాలు దొరికాయి. మానవబాంబుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి బ్యాగు వేసుకొని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ప్రవేశించడాన్ని అక్కడి సీసీ కెమెరాలు రికార్డు చేయగా, దీనికి సంబంధించిన ఫుటేజీ విడుదల చేశారు. నిందితుడు నింపాదిగా బ్యాగు తగిలించుకొని చర్చిలోకి ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH Colombo: CCTV footage of suspected suicide bomber (carrying a backpack) walking into St Sebastian church on Easter Sunday. #SriLankaBombings (Video courtesy- Siyatha TV) pic.twitter.com/YAe089D72h
— ANI (@ANI) April 23, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism