హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాద్‌నగర్ హత్యపై శ్రీముఖి దిగ్భ్రాంతి.. అమ్మాయిలూ జాగ్రత్త..

షాద్‌నగర్ హత్యపై శ్రీముఖి దిగ్భ్రాంతి.. అమ్మాయిలూ జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై స్పందించిన శ్రీముఖి.. రోడ్లపై అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దేశంలో మహిళలకు రక్షణ కరవయిందంటూ మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. నిందితులను నడి రోడ్డుప ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి ప్రియాంక హత్యను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే బయటకు వెళ్లే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా ఘటనపై స్పందించిన శ్రీముఖి.. రోడ్లపై అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ప్రియాంక రెడ్డి వార్త చాలా బాధేసింది. అమ్మాయిలు బయటకు వెళ్లేముందు జాగ్రత్తగా ఉండండి. మనకు చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. 100, 112తో పాటు షీ టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్లను అప్రోచ్ అవండి. రోడ్లపై అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్‌తో గానీ, కుటుంబ సభ్యులతో గానీ కనెక్షన్‌లో ఉండండి. లైవ్ ట్రాకింగ్ యాప్స్‌ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్తున్నారన్న దానిపై సమాచారం ఇవ్వండి. ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు.
శ్రీముఖి

First published:

Tags: Priyanka Reddy, Priyanka reddy murder, Sreemukhi, Telangana

ఉత్తమ కథలు