APARTMENT WATCHMAN MURDER MYSTERY SOLVED IN GUNTUR AND WIFE KILLS HUSBAND SSR
Guntur: భార్య, ఇద్దరు అత్తలు కలిసి చంపేశారు.. గుంటూరు జిల్లాలో ఘటన.. హత్యకు కారణమేంటంటే...
నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చిన పోలీసులు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన నల్లబోతు వెంకటేశ్వర్లు, అతని భార్య రామలింగమ్మ ఐదేళ్ల క్రితం గుంటూరు నగరానికి బతుకుదెరువు నిమిత్తం వలస వెళ్లారు. నగర శివారులోని గోరంట్ల సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వెంకటేశ్వర్లు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతని భార్య రామలింగమ్మ కూడా నగరంలోని ఓ కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తోంది.
గుంటూరు: గోరంట్ల శివారులో అపార్ట్మెంట్కు వాచ్మెన్గా పనిచేస్తూ హత్యకు గురైన వ్యక్తి మర్డర్ మిస్టరీని గుంటూరులోని నల్లపాడు పోలీసులు చేధించారు. అతని భార్య, ఇద్దరు అత్తలే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన నల్లబోతు వెంకటేశ్వర్లు, అతని భార్య రామలింగమ్మ ఐదేళ్ల క్రితం గుంటూరు నగరానికి బతుకుదెరువు నిమిత్తం వలస వెళ్లారు. నగర శివారులోని గోరంట్ల సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వెంకటేశ్వర్లు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతని భార్య రామలింగమ్మ కూడా నగరంలోని ఓ కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ అపార్ట్మెంట్లో ఓ గదిలో నివాసముండేవారు. ఇదిలా ఉండగా వెంకటేశ్వర్లు అత్తమామలు కూడా అతను పనిచేసే అపార్ట్మెంట్ పక్కనే మరో అపార్ట్మెంట్లో పనికి కుదిరారు. వెంకటేశ్వర్లు అత్త పేరు నాగేంద్రం. ఆమె చెల్లి వీరమ్మ కూడా ఇళ్లలో పనులు చేసుకుంటూ వీరితో పాటే ఉంటోంది. వెంకటేశ్వర్లుకు మద్యం అలవాటుంది. ఇటీవల వెంకటేశ్వర్లు భార్య రామలింగమ్మతో తరచూ మద్యం తాగొచ్చి గొడవపడుతున్నాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రామలింగమ్మ అతనిని చంపాలని నిర్ణయించుకుంది. ఆమె ఈ విషయాన్ని తన తల్లి నాగేంద్రంతో, పిన్ని వీరమ్మతో చెప్పింది.
వాళ్లు కూడా అల్లుడిని చంపేందుకు సాయం చేస్తామని చెప్పడంతో ఈ నెల 11న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చి గొడవపడి.. అనంతరం నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు మెడకు చీరతో ఉరి బిగించి కాళ్లూచేతులూ పట్టుకుని ముగ్గురూ హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. వెంకటేశ్వర్లు తల్లి అంకమ్మకు ఫోన్ చేసి రామలింగమ్మ, నాగేంద్రం, వీరమ్మ అక్కడి నుంచి పరారయ్యారు. కోడలి మాటలతో అనుమానం వ్యక్తం చేసిన వెంకటేశ్వర్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు విచారణను సవాల్గా స్వీకరించిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా వెంకటేశ్వర్లును హత్య చేసినట్లుగా ముగ్గురూ ఒప్పుకున్నారు. భర్త వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చంపాలని నిర్ణయించుకుని అతనిని భార్య హతమార్చడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.