news18
Updated: November 23, 2020, 6:55 PM IST
ప్రతీకాత్మకచిత్రం
- News18
- Last Updated:
November 23, 2020, 6:55 PM IST
ఇంకా లోకం గురించి తెలియని ఆ పసిపాప అన్నయ్య ను నమ్మింది. ఎప్పటిలాగే ఇంట్లోకెళ్లి టీవీ చూస్తూ.. అక్కడే ఆడుకుందామనుకుంది. అన్నయ్య వాళ్లింటికెళ్లి వెళ్లింది. ఆ కామాంధుడు తనను గదిలోకి తీసుకెళ్లుతుంటే.. అక్కడ ఆడుకోవచ్చునని అనుకుంది. కానీ ఆ పసిమనసుకు తెలియదు.. తాను వెళ్తున్నది తన అన్నతో కాదు.. కామంతో వావీ వరసలు మరిచిన ఒక దుర్మార్గుడితో అని..! ఆ నీచుడు ఆ పాపను గదిలోకి తీసుకెళ్లగానే గదికి గడియవేశాడు. అభం శుభం తెలియని ఆ పసి మనసుపై ఎప్పటికీ మరిచిపోని గాయాన్ని రేపాడు. సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోగల మిడ్జిల్ మండలంలోని తండాకు చెందిన చిన్నారిపై వరుసకు అన్నైన యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై ఆ దుర్మార్గుడు.. లైంగికదాడి చేశాడు. ఆ పసి మనసు అరుస్తున్నా.. రాక్షస కౌగిలి కింద నలిగిపోతున్నా.. పట్టించుకోకుండా.. తన కోరిక తీర్చుకున్నాడు. అన్నా.. అన్నా.. అంటూ ఆ పసిపాప రోధిస్తున్నా.. ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు. వావివరసలు మరచి కామంతో పశువులా ప్రవర్తించాడు.
తండాకు చెందిన గిరిజన దంపతులు పొలానికి పనికి వెళ్లగా.. వారి కుమార్తె అయిన ఏడేళ్ల వయసు చిన్నారి ఎవరు లేని సమయంలో టీవీ చూడడానికి సొంత పెదనాన్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వారింట్లో కూడా ఎవరూ లేరు. దీంతో ఆ యువకుడు.. ఆ పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేసినా విడిచిపెట్టలేదు. ఆమెకు తీవ్ర రక్తస్రావంతో నీరసించి ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోగా అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు సేకరించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Published by:
Srinivas Munigala
First published:
November 23, 2020, 6:55 PM IST