హోమ్ /వార్తలు /క్రైమ్ /

Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..

Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..

రమేశ్ అతడి భార్య

రమేశ్ అతడి భార్య

Sad Incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రు గొండ గ్రామానికి చెందిన కంటే రమేష్ కొంత ఇంటిని నిర్మిస్తున్నాడడు. అయితే ఆ ఇంటి నిర్మాణం సగం వరకు పూర్తయింది. దానికి నీళ్లు పట్టే సమయంలో.. పక్కనే ఉన్న మరో ఇంటిలో నీటి చుక్కలు పడ్డాయి.

ఇంకా చదవండి ...

(G.Srinivasreddy,News18,Khammam)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలం బండ్రు గొండ గ్రామానికి (Bandru Gonda Village) చెందిన కంటే రమేష్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. అయితే ఆ ఇంటి నిర్మాణం(construction) సగం వరకు పూర్తయింది. దానికి నీళ్లు పట్టే సమయంలో.. పక్కనే ఉన్న మరో ఇంటిలో నీటి చుక్కలు పడ్డాయి. దీంతో ఆ పొరుగింటి వ్యక్తి.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నీళ్లు పట్టే వ్యక్తిని తాళ్లతో బంధించి .. చేతులను (Hands) కట్టేసి.. కొట్టుకుంటూ.. రోడ్డుపై లాక్కెల్లారు. ఇలా అతడిని తాళ్లతో కట్టి లాక్కెళ్లి.. తన ఇంటి ముందు పందిరి గుంజకు బంధించాడు. ఇక అక్కడ అతడిని కర్రలతో, చీపుర్లతో కొట్టాడు. ఇలా అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. కనీసం అతడికి తాగడానికి నీళ్లను కూడా ఇవ్వలేదు.

Sad: వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా.. వాళ్లను చూసిన తర్వాత భార్యభర్తలు ఇలా ఉండొద్దని నేర్చుకుంటారు..


తినేందకు అన్నం కూడా లేకుండా చేశారు. చివరకు మూత్ర విసర్జన సైతం చేయించకుండా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. అతడిని దాదాపు 18 గంటల పాటు గుంజకు కట్టేసి బంధించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు పోలీసులకు తెలవడంతో.. అతడిని విడిచిపెట్టారు. నిన్న ఈ విషయం పై సమాచారం అందించేందుకు 100 కు మూడు సార్లు ఫోన్ చేయగా స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు.. పాల్వంచ రూరల్ ఎస్ఐకి ఫోన్ చేయగా ఎత్తలేదని తెలిపారు.

అతడు సంతోషంగా వదిన ఇంటికి వెళ్లాడు.. చెప్పాల్సింది చెప్పేశాడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..


అనంతరం పాల్వంచ ఏఎస్పీకు (Palvancha ASP) ఫోన్ చేయగా.. అతడు స్పందించాడని. ఏం జరిగిందో వివరాలను తెలిపాలని.. ఆ వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నాడు. అక్కడ జరిగిన ప్రతీ విషయాన్ని స్థానికులు  పోలీసులకు చెప్పారు. అడ్రస్ కూడా చెప్పడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని.. అతడిని విడిపించారు. ఇదిలా ఉంటే.. చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ 18 గంటల పాటు నరకయాతన అనుభవించిన అతడు తనకు న్యాయం చేయాలంటూ కోరాడు.

Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..


ఇక ఈ దారుణ ఘటనతో పాటు మరో ఘటన కూడా చోటు చేసుకుందని వివరించాడు. ఇంటి నిర్మాణం కోసం తాను ఇంట్లో రూ.30 వేల నగదును (Thirty Thousand) దాచానని.. అవి ఎవరో దొంగిలించారు. తనకు న్యాయం చేయాలంటూ.. అతడు పోలీసులను వేడుకున్నాడు.


Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


ఎన్ని సార్లు పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన భార్య ఊరెళ్లిన సమయంలో వాళ్లు గొడవ పెట్టుకునేందుకు రెడీగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు.

First published:

Tags: Crime, Crime news, Khammam

ఉత్తమ కథలు