Assam-Meghalaya Border Violence : అసోం-మేఘాలయ బోర్డర్(Assam-Meghalaya Border) లో హింస చెలరేగింది. మంగళవారం తెల్లవారుజామున అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మరణించారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో హింస జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన తరువాత, అసోం పోలీసులు మేఘాలయ సరిహద్దులో ఉన్న అన్ని జిల్లాలలో శాంతిభద్రతల పరిస్థితి స్థిరంగా ఉంచేందుకు అప్రమత్తం చేసినట్లు మరొక అధికారి తెలిపారు.
అసలేం జరిగిందంటే
కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైపు అక్రమ కలపను తీసుకువెళుతున్న ఓ ట్రక్కును అసోం అటవీ శాఖ బృందం అడ్డగించి ఆపివేసినట్లు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ ఎస్పీ ఇమ్దాద్ అలీ తెలిపారు. అయితే ట్రక్కులోని వారు పారిపోవడానికి ప్రయత్నించగా, ఫారెస్ట్ గార్డులు దానిపై కాల్పులు జరిపి టైర్ గాలిని తీసేశారని తెలిపారు.డఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని పారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారని.. మిగిలినవారు పారిపోయారని తెలిపారు.
Tamilnadu: తండ్రి సమాధి కోసం గూగుల్లో సెర్చ్ చేసి మలేషియా ప్రయాణం..తమిళనాడు వ్యక్తి ఇంట్రెస్టింగ్ జర్నీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.