హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Sabarimala Piligrims : కేరళలో విషాదం..ఇంటి మీదకి దూసుకెళ్లిన అయ్యప్ప భక్తుల వ్యాన్

Sabarimala Piligrims : కేరళలో విషాదం..ఇంటి మీదకి దూసుకెళ్లిన అయ్యప్ప భక్తుల వ్యాన్

Image credit : Mathrubhumi news

Image credit : Mathrubhumi news

 Van falls over house : కేరళలోని ఇడుక్కిలో(Idukki) విషాద ఘటన చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం ఓ ఇంటిపై నుంచి జారి పక్కనే ఉన్న ఇంటి మీదకు దూసుకెళ్లింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Van falls over house : కేరళలోని ఇడుక్కిలో(Idukki) విషాద ఘటన చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ మినీ వ్యాన్ వాహనం ఓ ఇంటిపై నుంచి జారి పక్కనే ఉన్న ఇంటి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 3.45 గంటల సమయంలో కట్టప్పలోని పరక్కడవులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16మంది విద్యార్థులు  గాయపడ్డారు. నివేదికల ప్రకారం..మినీ వ్యాన్ అదుపు తప్పి ఇంటి కార్ పోర్చ్ మీద పడింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ప్రమాదం గురించి తెలుసుకున్నారు. కాగా, స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులని తమిళనాడు వాసులుగా గుర్తించారు. ప్రస్తుతం వారు కట్టప్పనలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు,రెండు రోజుల క్రితం కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు లోయలో పడిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. తిరువనంతపురం నుండి 320 కిలోమీటర్ల దూరంలోని తిరుర్‌లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమ స్టడీ టూర్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం ప‌లుకుతున్న‌ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తమిళనాడులోని కొండ ప్రాంతంలోని కొడైకెనాల్ నుంచి బస్సు వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వెల్లతువల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

OMG: రోడ్డు ప్రమాదాల్లో తగ్గేదేలే అంటున్న తెలంగాణ ..ఏడాదిలో ఎంత మంది చనిపోయారంటే

బోటులో విద్యార్థులు డిసెంబర్ 29న కొడైకెనాల్‌ను సందర్శించేందుకు వెళ్లారు. వారు తిరిగి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక నివాసితులు, రెస్క్యూ వర్కర్లు, పోలీసులు గాయపడిన వారిని బస్సు నుండి సమీపంలోని తాలూకా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో 20 ఏళ్ల యువకుడు మరణించాడని అధికారి తెలిపారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో బస్సు మలుపు తీసుకోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు