news18-telugu
Updated: January 13, 2021, 7:31 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భారత్లో కరోనా వ్యాక్సిన్ ఈనెల 16 నుంచి పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చేశాయి. వాటిని ఫ్రీజర్లలో భద్రపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్గా పేరొందిన భారత్లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక సూచనలు చేసింది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మరి మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంత మందికి టీకా వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. మన దేశంలో ఒక ఏడాది కంటే పైనే ఈ ప్రక్రియ ఉంటుందని తెలిపింది.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు చేసింది.
- తీవ్రమైన తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణిలు, పాలిచ్చే బాలింతలు,
- 16 ఏళ్ల లోపు పిల్లలు
- టీకా తీసుకున్న మహిళలు రెండు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలి
- హెచ్ఐవి బాధితులకు ముందే చెప్పాలి
- 18 సంవత్సరాలు దాటిన వారికే కరోనా వ్యాక్సిన్
- 16 ఏళ్ల లోపు వారికి అసలు వ్యాక్సిన్ వేయవద్దు
- 16 సంవత్సరాల లోపు వారిలో వ్యాక్సిన్ను తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు
ఇక డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేసిన కోవిషీల్డ్, కొవాగ్జిన్.. ఈ రెండూ సురక్షితమైనవేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వీటిలో ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని.. ఈ రెండింటిలోనే ఏదో ఒక టీకా అందుతుందని తెలిపింది. వీటితో పాటు జైడుస్ క్యాడిల్లా తయారుచేసిన జైకోవ్ డీ, రష్యా వాక్సిన్ స్పుత్నిక్-వీ, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ, జెనోవా సంస్థల వ్యాక్సిన్లు కూడా ట్రయల్స్ దశలో ఉన్నాయని వెల్లడించింది. వీటిలో జైకోవ్ డీ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక స్పుత్నిక్-వీ రెండో దశ, బయోలాజికల్-ఈ ఒకటో దశ ప్రయోగాలను పూర్తి చేసుకున్నాయి. జెనోవా సంస్థ RNA ఆధారిత కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 13, 2021, 7:19 PM IST