విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. స్వర్ణా ప్యాలస్ హోటల్ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్గా వాడుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి...ఈ ఘటన పట్ల విచారం వ్యక్తంచేశారు. మృతులకు ప్రగాడ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన వారు...క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటనలో, పలువురు మృతి చెందారని తెలిసి ఎంతో విచారించాను. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
— President of India (@rashtrapatibhvn) August 9, 2020
విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) August 9, 2020
అటు ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ అగ్ని ప్రమాద ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యకత్ంచేశారు. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ వద్ద ఆరా తీసినట్లు తెలిపారు. ఏ రకమైన సాయం కావాలన్నా కేంద్రం నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
Anguished by the fire at a Covid Centre in Vijayawada. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover as soon as possible. Discussed the prevailing situation with AP CM @ysjagan Ji and assured all possible support.
— Narendra Modi (@narendramodi) August 9, 2020
విజయవాడ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Pm modi, President of India, Vice President of India, Vijayawada Fire Accident