హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

United Nations: భారత్ ఈ ప్రపంచానికే గొప్ప ఆస్తి.. ఐక్యరాజ్య సమితి ప్రశంసలు

United Nations: భారత్ ఈ ప్రపంచానికే గొప్ప ఆస్తి.. ఐక్యరాజ్య సమితి ప్రశంసలు

మార్చి 14 నుంచి 22 వరకు నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయుఎల్) తనిఖీ ఫలితాల నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఐరాస ద్వారా ఎగుమతిని నిలిపివేయడం వల్ల కొవాగ్జిన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది

మార్చి 14 నుంచి 22 వరకు నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయుఎల్) తనిఖీ ఫలితాల నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఐరాస ద్వారా ఎగుమతిని నిలిపివేయడం వల్ల కొవాగ్జిన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్‌లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి.

భారత్‌పై ఐక్యరాజ్య సమితి ప్రశంసల జల్లు కురిపించింది. భారీ స్థాయిలో కరోనా టీకాలను ఉత్పత్తి చేయలగల భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ మాట్లాడారు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు భారత్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. అక్కడ దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్‌ల గురించి తమకు తెలుసన్న ఆంటోనియో.. ఆయా టీకా తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యస సమితి అభిప్రాయపడ్డారు.


ఇటీవలే భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసలు కురిపించింది. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు సాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోదీకి WHO డీజీ డెడ్రోస్ గ్యాబ్రియేసస్‌ ధన్యవాదాలు తెలిపారు. ఒకరికొకరం సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పోరాడితేనే వైరస్‌ను నిర్మూలించగలుగుతామని.. ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడలుగుతామని పేర్కొన్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందంటే.. కరోనా వ్యాక్సినేషన్‌లో భారత పాత్రేంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్‌లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు మనదేశం ఉచితంగానే టీకాను అందజేస్తోంది. బ్రెజిల్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాలకు టీకాలను పంపిస్తోంది. త్వరలోనే ఒమన్, నికరాగ్వా, కరీబియన్ దేశాలతో పాటు పసిఫిక్ దేశాలకు కూడా టీకా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాదు ఆఫ్రికాకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని, ఐక్యరాజ్య సమితికి 10 లక్షల డోస్‌లను ఇస్తామని చెప్పారు.

First published:

Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, Covishield

ఉత్తమ కథలు