హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఈ-పాస్ అవసరం లేదు.. తెలంగాణ నుంచి ఏపీకి నేరుగా వెళ్లొచ్చు

ఈ-పాస్ అవసరం లేదు.. తెలంగాణ నుంచి ఏపీకి నేరుగా వెళ్లొచ్చు

ఒడిశా లాక్ డౌన్ సమయంలో అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ప్రభుత్వం సూచించిన నియమాలను అనుసరించాలి. రూల్స్ బ్రేక్ చేసే వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఒడిశా లాక్ డౌన్ సమయంలో అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ప్రభుత్వం సూచించిన నియమాలను అనుసరించాలి. రూల్స్ బ్రేక్ చేసే వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,45,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 3,39,876 మంది కోలుకున్నారు.

అన్‌లాక్ 4కు సంబంధించి ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ-పాస్ నిబంధనను తొలగించొంది. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌తో పని లేకుండానే ఆంధ్రప్రదేశ్‌లోకి ఇతర రాష్ట్రాల ప్రజలు రావచ్చు. రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించించడంతో సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను ఏపీ అధికారులు తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను మాత్రం తనిఖీ చేస్తున్నారు.

కాగా, ఏపీలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,45,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 3,39,876 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 4,053 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 97,681 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 37.82 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Coronavirus, Lockdown relaxations, Unlock 4.0

ఉత్తమ కథలు