తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ICMR అప్రూవ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎందుకు టెస్ట్లు చేయడం లేదని విమర్శించారు. సౌత్ కొరియాను ఆదర్శంగా చేసుకొని.. పెద్ద ఎత్తున టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉత్తమ్. సోమవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇక కరోనా వ్యాప్తి గురించి రాహుల్ గాంధీ ముందే హెచ్చరికలు చేసినప్పటికీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు .
కరోన వల్ల పేద వర్గాల వారికి కాంగ్రెస్ క్యాడర్ సహాయం అందచేస్తు అద్భుతంగా పని చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.. నిత్యావసర సరుకులను కూడా ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Coronavirus, Covid-19, Uttam Kumar Reddy