తెలంగాణలో తగిన సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య ఒక్క సారిగా తగ్గడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం (IMCT) అక్కడ తగినన్ని టెస్టింగ్ కిట్లు, పీపీఈలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నట్టు గుర్తించిందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. ఎండ్ టు ఎండ్ ఐటీ డ్యాష్ బోర్డు ద్వారా కరోనా పరీక్షల నుంచి డిశ్చార్జి వరకు పేషెంట్లను ట్రాక్ చేస్తున్నారని వినియోగిస్తున్నారని ఆమె చెప్పారు.
Central Team visiting Hyderabad has found that the state has adequate no. of testing kits, PPE, etc. The state is using an end-to-end IT dashboard to track patients right from testing to discharge: Punya Salila Srivastava, Joint Secretary, Ministry of Home Affairs (MHA) pic.twitter.com/29y1AadCWt
— ANI (@ANI) April 30, 2020
వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుందా? అని రిపోర్టర్లు అడగ్గా.. ప్రస్తుతం బస్సులను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. రైళ్లలో వలస కూలీల తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Coronavirus, Covid-19, Hyderabad, Telangana