హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

సీఎంఆర్ఎఫ్‌కు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం...

సీఎంఆర్ఎఫ్‌కు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం...

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్లు విరాళంగా అందించారు.

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్లు విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును నాలుగు సంస్థలకు చెందిన సీఎండీలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్ కో – ట్రాన్స్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజి, రత్నాకర్ రావు, అంజయ్య, బీసీ రెడ్డి, సాయిబాబా, ప్రకాశ్, జాన్సన్, రమేశ్, వజీర్, కుమారస్వామి, సాయిలు, గణేష్, సత్యనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్ళు కష్టపడి 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్పూర్తిగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Telangana

ఉత్తమ కథలు