హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Coronavirus: కరోనా అనుమానితులపై నిఘా... ఇండియాలోనే తొలి యాప్ రూపొందించిన తెలంగాణ

Coronavirus: కరోనా అనుమానితులపై నిఘా... ఇండియాలోనే తొలి యాప్ రూపొందించిన తెలంగాణ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Covid-19 Monitoring System | ఒక డివైజ్ రోజూ ద్వారా 75 నుంచి 100 ఇళ్లపై నిఘా పెట్టొచ్చు. తెలంగాణలోని 33 జిల్లాల హెల్త్ వర్కర్స్ నెలకు 50,000 కాల్స్/ఛాట్ బాట్ ఇంటరాక్షన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు.

కరోనా వైరస్ అనుమానితులపై రియల్‌టైమ్‌లో నిఘా పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం 'కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్' రూపొందించింది. భారతదేశంలోని తొలి హెల్త్ సర్వైలెన్స్ ప్లాట్‌ఫామ్ ఇది. అమెరికాతో పాటు హైదరాబాద్‌లో ఉన్న వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ స్టార్టప్ కేవలం మూడు రోజుల్లోనే తయారు చేసిన ఈ యాప్‌ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు ఆవిష్కరించారు. కరోనా వైరస్ బాధితులను గుర్తించడం, వారిపై రియల్‌టైమ్‌లో నిఘా పెట్టడం, ట్రాక్ చేయడం, పర్యవేక్షించడం, రియల్‌టైమ్ అనలిటిక్స్‌ను ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందజేయడం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాధ్యం. హెల్త్ వర్కర్లు ఈ యాప్ ద్వారా కరోనా లక్షణాలున్నవారు లేదా కోవిడ్ 19 బాధితులకు రోజూ కాంటాక్ట్‌లో ఉండొచ్చు. క్వారెంటైన్‌లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేస్తుంది. సామాజిక దూరాన్ని పాటించడం, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు చెప్పడం కోసం ఈ యాప్‌ను హెల్త్ వర్కర్స్ ఉపయోగించుకోవచ్చు.

విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతోంది. టెక్నాలజీ ఆవిష్కరణతో రూపొందించిన వెరా సెంట్రలైజ్డ్ కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్ సమర్థవంతమైన నిఘా పెట్టడం ద్వారా హెల్త్ వర్కర్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

డాక్టర్ జి. శ్రీనివాస్ రావు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

ఒక డివైజ్ రోజూ ద్వారా 75 నుంచి 100 ఇళ్లపై నిఘా పెట్టొచ్చు. తెలంగాణలోని 33 జిల్లాల హెల్త్ వర్కర్స్ నెలకు 50,000 కాల్స్/ఛాట్ బాట్ ఇంటరాక్షన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. కోవిడ్-19 పేషెంట్లను, వారి కాంటాక్ట్‌లను జియో ట్యాగ్ చేయడం ద్వారా వారిని ట్రేస్ చేయడం అధికారులకు సులువవుతుంది. 1,500-2,000 మంది ఆశా, ఏఎన్ఎం వర్కర్లు ఈ యాప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీరు సేకరించే సమాచారం 4,800 ప్రజారోగ్య ఉప కేంద్రాలకు వెళ్తుంది. అటు నుంచి రాష్ట్రంలోని 886 పబ్లిక్ హెల్త్ సెంటర్లకు సమాచారాన్ని పంపిస్తారు. ఆ డేటాను సంబంధిత జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయానికి అప్‌లోడ్ చేస్తారు.

ఇవి కూడా చదవండి:

Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

Aadhaar SMS Services: మీ ఇంట్లోంచే ఈ ఆధార్ సేవలు పొందండి

Savings: పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...

First published:

Tags: CAREER, Exams, Job notification, JOBS, Mobile App, NOTIFICATION, Telangana, Telangana Government, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు