లాక్డౌన్ గడువు ముగుస్తుండటం, వానాకాలం వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కరోనాపై తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగిస్తున్న సరి, బేసి విధానాన్ని అలాగే కొనసాగించాలా? ఏవైనా మార్పులు చేయాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సమీపిస్తుండటంతో నియంత్రిత వ్యవసాయం, ఎరువుల లభ్యత, విత్తనాల అందుబాటుపైనా సీఎం సమీక్ష చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఎలా జరపాలన్న దానిపైనా చర్చించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Coronavirus, Lockdown, Telangana News