హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

పారిశుద్ధ్య కార్మికురాలు విరాళం.. అభినందించిన మంత్రి కేటీఆర్

పారిశుద్ధ్య కార్మికురాలు విరాళం.. అభినందించిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్‌కు రూ.10వేలు అందజేస్తున్న అలివేలు

మంత్రి కేటీఆర్‌కు రూ.10వేలు అందజేస్తున్న అలివేలు

మానవాళి గతంలో ఎన్నడూ ఎరుగని కరోనా వైరస్ అనేక మంది మనసుని కదిలిస్తుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కష్టకాలంలో అనేక మంది తమకు తోచిన విధంగా పరులకు ఉపకారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం పెట్టి.. కడుపు నింపుతున్నారు. మరికొందరు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చి తన వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మంటళవారం హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన పెద్ద మనసును చాటుకుంది. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతు సాయం చేసింది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 వేలు ఆమె విరాళంగా ఇచ్చింది. పారిశుద్ధ్య కార్మికులరాలి దాతృత్వానికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.

జియాగూడకు చెందిన అలివేలు గత ఐదేళ్లుగా జీహెచ్ఎంసిలో పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో అందరూ తమకు తోచినంత సాయం చేస్తుండడంతో.. అలివేలు కూడా తనవంతుగా ముందుకొచ్చారు. తన నెల జీతం రూ.12000 నుంచి పదివేల రూపాయలు తీసి మంత్రి మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ని కలిసి డబ్బును అందజేశారు. ఈ సందర్భంగా అలివేలు మంచి మనసుని అభినందించిన మంత్రి కేటీఆర్.. ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇంత తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక నెల జీతాన్ని కరొనా పోరు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అలివేలుని మంత్రి అభినందించారు. పిల్లలు భర్త ఏం చేస్తారంటుటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్ లో రోజువారి కూలీగా పని చేస్తారని, తన పిల్లలు చదువుకుంటున్నారని అలివేలు ఈ సందర్భంగా అలివేలు తెలిపారు. తన కుటుంబానికి ఎప్పుడైనా నేను అండగా ఉంటానని, ఏదైనా సహాయం కావాలంటే చెప్పాలని అని మంత్రి కేటీఆర్ అనగా, తాను ఎలాంటి లాభాపేక్ష కానీ ప్రయోజనం కానీ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని ఆమె చెప్పారు. కేవలం ఇతరులకు ఈ కష్టకాలంలో ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఇస్తున్నానని మంత్రికి సమాధానం ఇచ్చారు అలివేలు. రెండో ఆలోచన లేకుండా తనకు తోచిన మేర సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన అలివేలు మంచి మనసు పట్ల మంత్రి అభినందనలు వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలుగా ఒకవైపు కరొనా పోరులో ముందు వరుసలో ఉన్న అలివేలు.. విరాళం సైతం ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షనీయమని అన్నారు. ఆమె దాతృత్వం కరొనా పోరులో ముందువరుసలో నిలిచిన ప్రతి ఒక్కరికి మరింత గౌరవాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Lockdown, Telangana

ఉత్తమ కథలు