కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కారణంగా దేశంలో మూడో వేవ్ ప్రభావం కనపడుతోంది. ఈ నేపథ్యంలో రెండో వేవ్కు ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్ (Delta Variant) కు ప్రస్తుతం ఎక్కువగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్కు ప్రధాన తేడా ఏమిటి అనేది వైద్యులు విశ్లేషణ చేస్తున్నారు. దీనికి సంబంధించి దగ్గు స్వభావంతో ఒమిక్రాన్, డెల్టాను గుర్తించవచ్చని AIG హాస్పిటల్స్ వైద్యులు గుర్తించారు. తెలిసిన పరిశోధనలు మరియు వారు చికిత్స పొందిన రోగుల వ్యక్తిగత పరిశీలనల ఆధారంగా, చాలా మంది డెల్టా వేరియంట్ ప్రభావిత రోగులు పొడి దగ్గు (Dry cough)తో బాధపడుతున్నారని.. ఒమిక్రాన్ బాధితులు తడి దగ్గు (wet cough(తో బాధతపడుతున్నారని గుర్తించారు. ఎక్కువ కేసుల్లో ఈ పోలిక ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై AIG హాస్పిటల్స్లోని కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కేతన్ మష్రా స్పందించారు. ఎక్కువ మంది రోగుల్లో కనిపించిన లక్షణాల ఆధారంగా ఈ విషయం గుర్తించామన్నారు.
ఒమిక్రాన్ (Omicron) వచ్చిన వారిలో 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం ఉండడం, తీవ్రమైన తలనొప్పి, గొంతు గరగర ఉండడం ఎక్కువగా గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
కండ్ల కలక, వాసన కోల్పోవడం, నాడీ సంబంధ లక్షణాలు డెల్టా వేరియంట్లో ఎక్కువగా కనపడ్డట్టు వైద్యులు చెబుతున్నారు. రోగికి చికిత్స చేయడానికి ఈ రకమైన లక్షణాలను నిశితంగా పరిశీలించడం చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది డెల్టా (Delta) అయితే, శరీరంపై వ్యక్తీకరణ మరింత తీవ్రంగా ఉంటుంది. ఒమిక్రాన్ అయితే చికిత్స మరో రకంగా ఉంటుంది. కాబట్టి లక్షణాలను నిశితంగా పరిశీలించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
Covid 19 Vaccination: 14.29కోట్ల మందికి వ్యాక్సిన్లు.. దేశంలో 9శాతం వ్యాక్సినేషన్ అక్కడే!
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
దేశంలో మళ్లీ మూడో వేవ్ (Third Wave) ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముం బయిలోని జస్లోక్ ఆస్ప త్రి వైద్యు డు డాక్టర్ సంజయ్ నాగ్రాల్, కేరళలోని రాజ్గిరి ఆస్పత్రికి చెందిన డాక్టర్ సిరియక్ ఫిలిప్, బెంగళూరుకి చెందిన డాక్టర్ రాజనీ భట్, యూఎస్, కెనడాకు చెందిన మరికొందరు భారతీయ వైద్యులు సహా మొత్తం 32 మంది వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా విషయంలో సెకండ్ వేవ్ (Second Wave) సమయంలో చేసిన తప్పులే ఈ ఏడాదిలోనూ పునరావృతమవుతున్నాయని వైద్యులు (Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చికిత్స విధానంలో మార్పులు అవసరం అని వారు అభిప్రాయ పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Delta Variant, India, Omicron, Omicron corona variant