news18-telugu
Updated: June 27, 2020, 7:49 PM IST
శ్రీకాళహస్తి
కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో శ్రీకాళహస్తిలో మళ్లీ లాక్డౌన్ విధించబోతున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ ప్రకటన చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో నానాటికి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణంలోలాక్ డౌన్ విధించబోతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. వ్యాపారస్తులు కూడా ఇదే సమయంలో తన వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు వివరించారు.
ప్రజలంతా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లాక్డౌన్ పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితిలో మాస్కులు ధరించి ప్రజలు బయటరావాలని అన్నారు. ఎవరైనా మాస్కులు ధరించకపోతే వారికి రూ. 100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమ రక్షణ వలయం నుండి తమను తాము కాపాడుకుంటూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
First published:
June 27, 2020, 3:33 PM IST