ఎప్పుడు బాధ్యతగా మాట్లాడటంలో రష్మి గౌతమ్ ముందుంటుంది. తనలో చాలా సామాజిక బాధ్యత కూడా ఉందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్థంభించిపోతుంది. ఎప్పుడు ఎవరు బయటికి వచ్చినా కూడా ఏమవుతుందో అని భయపడుతున్నారు జనాలు. కనీసం పదిమంది కలిసి ఒకేచోట కనిపించినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తామంటున్నారు. మార్చ్ 31 వరకు పెళ్లిళ్లు, గుళ్లు, మసీదులు కూడా మూసేసారు. జనం బయటికి రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇప్పుడు రష్మి గౌతమ్ మాత్రం తను ఓ షాప్ ఓపెనింగ్కు వస్తున్నాను.. మీరు కూడా రండి అంటూ అభిమానులకు ఆహ్వానం పలుకుతుంది.
See u there https://t.co/vUwTwTaByO
— rashmi gautam (@rashmigautam27) March 19, 2020
బయట కరోనా వైరస్ ఉందనే విషయాన్ని కూడా ఈమె మర్చిపోయినట్లుంది.. అందుకే ఏకంగా నేను వస్తున్నాను.. మీరు కూడా వచ్చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బయటకి వెళ్లడానికే భయపడుతున్న జనాన్ని.. తను వస్తున్నాను రమ్మని పిలుస్తుంది రష్మి గౌతమ్. మార్చ్ 20న రాజమండ్రిలో లెనిన్ హౌజ్ ఓపెనింగ్కు వస్తుంది రష్మి. దీనికోసం ప్రత్యేకంగా వీడియో బైట్ కూడా ఇచ్చింది ఈమె. ఇది చూసి నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.
ఓ వైపు కరోనా భయంతో జనాలు గుమిగూడొద్దు అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటే.. అందర్నీ రమ్మంటున్నావ్.. బాధ్యత ఉండక్కర్లా రష్మి నీకు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరిచిపోయి పిలిచిందా.. కరోనా మననేం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటుందో తెలియదు కానీ రష్మి చేసిన పనికి మాత్రం ఇప్పుడు విమర్శలు భారీగానే వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Coronavirus, Telugu Cinema, Tollywood