దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్లు ప్రభుత్వం కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరూ వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని టీకా కేంద్రాలు 500 ఎంజీ పారాసెటమాల్ (Paracetamol) మాత్ర తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ (Bharat Bio Tech) తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పిల్లలకు కొవాగ్జిన్ టీకా (Covaxin vaccine) ఇచ్చా క పారాసెటమాల్ ట్యా బ్లెట్లు కానీ, నొప్పి నివారణ మాత్రలు గానీ వేసుకోవాలని తాము సిఫారసు చేయలేదని భారత్ బయోటెక్ పేర్కొం ది. టీకా తీసుకున్న పిల్లలకు పారాసెటమాల్ - 500 ఎం జీ ట్యా బ్లెట్లు 3 వేసుకోవాలని సూచిస్తున్న ట్లు తమ దృ ష్టికి వచ్చిం దని, అలా చేయాలని తాము చెప్ప లేదని భారత్ బయోటెక్ ట్వి టర్లో పేర్కొం ది.
#bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe
— BharatBiotech (@BharatBiotech) January 5, 2022
క్లినికల్ ట్రయల్స్లో భాగం గా కొవాగ్జిన్ టీకాను 30,000 మం దిపై పరీక్షిం చగా, 10- 20 శాతం మం దిలోనే కొన్ని ‘సైడ్ ఎఫెక్ట్స్ ’ కనిపిం చాయని, అవి కూడా ఎం తో చిన్న వని వివరిం చిం ది. రెం డు మూడు రోజుల్లోనే అవి సర్దుకున్నాయని వాటి కోసం ప్రత్యేక చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) వేగంగా మళ్లీ పెరగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా కొత్త వేవ్ దెబ్బకు ఇబ్బంది పడుతోంది. దేశంలోనూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య లక్షకుపైగా వచ్చాయి. దీంతో మూడో వేవ్ (Third Wave) ప్రారంభం అయ్యిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా ప్రాణాంతకం కాదని ఇప్పటి వరుకు పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీనిపై డబ్ల్యూహ్చ్ఓ (WHO) స్పందించింది. ఒమిక్రాన్న తీవ్రతను తక్కువగ ఉందని చెప్పడం అర్థం లేదని స్పష్టం డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. ఒమిక్రాన్ ప్రాణాంతక వేరియంట్ అని పేర్కొంది. ప్రస్తుతం ఒమిక్రాన్ బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. ఆయా దేశాలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.