హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఏపీలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్... డీజీపీ హెచ్చరిక

ఏపీలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్... డీజీపీ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులకు పలు సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం, వారు కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినట్టు తేలడంతో, కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోయినా, కరనా సోకిన వారితో కాంటాక్ట్ కాకపోయినా కూడా వారికి కరోనా సోకింది. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో ఏపీలోని పోలీసులకు డీజీపీ కార్యాలయం మెమో జారీ చేసింది. అందులో పలు సూచనలు చేసింది. కేబుల్ టీవీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వారు, పాలు పోసేవారు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, కూరగాయలు షాపులు, పండ్ల దుకాణాలు, మెడికల్ షాపులు కరెన్సీ విరివిగా వాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఆర్ఎంపీ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు పలు సూచనలు చేశారు.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ పాకినట్టు పోలీసులు భావిస్తున్నారు


  • ప్రజలు కరెన్సీ నోట్లను తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు వాటిని శానిటైజ్ చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి.

  • 14వ తేదీ నుంచి రెండు వారాల పాటు ఎలాంటి కరెన్సీ కలెక్ట్ చేయవద్దు

  • నిత్యావసరాలకు సంబంధించి కూడా ఎవరూ రెడ్ జోన్లలోకి వెళ్లొద్దు

  • రెడ్ జోన్లలో డ్యూటీ చేసే గ్రామ, వార్డు వాలంటీర్లు, పోలీసులకు తప్పనిసరిగా కరోనా టెస్టులు నిర్వహించాలి.

  • ఒకే చోట ఎక్కువ మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దు. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్, ప్రత్యేక బాత్రూమ్ ఉండేలా చూడాలి.

  • జిల్లాల కలెక్టర్లు, DMHOలతో టచ్‌లో ఉంటూ, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.

  • యూపీలోని ‘దియోబందీ’కి హాజరైన ఏపీ వాసులను గుర్తించాలి. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అలాంటి వారు ఉన్నట్టు గుర్తించారు.


  • పోలీసులకు డీజీపీ కార్యాలయం ఆదేశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం 5 నుంచి బుధవారం ఉదయం 9 వరకు కొత్తగా... 19 కేసులు నమోదవ్వడంతో... ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరింది. కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. గుంటూరులో కొత్త కేసులు తగ్గాయి కదా అనుకుంటే... అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 8 రావడం డేంజర్ బెల్ అనుకోవచ్చు. రాష్ట్రంలోని 502 కేసుల్లో ఇప్పటివరకూ 16 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో అనంతపురం నుంచి 2, కృష్ణ 3, గుంటూరు 4, కర్నూలు 1, నెల్లూరు నుంచి 1 ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి సంఖ్య 475గా ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Gautam Sawang

ఉత్తమ కథలు