హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తండ్రీ కొడుకులను కలిపిన లాక్‌డౌన్..

తండ్రీ కొడుకులను కలిపిన లాక్‌డౌన్..

లాక్‌డౌన్ కొందరికి మంచి కూడా చేసింది. ఓ తండ్రిని కుమారులకు దగ్గర చేసింది.. కుమారులకు తండ్రిని అందించింది.

లాక్‌డౌన్ కొందరికి మంచి కూడా చేసింది. ఓ తండ్రిని కుమారులకు దగ్గర చేసింది.. కుమారులకు తండ్రిని అందించింది.

కరమ్ సింగ్(70) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడు. కుమారుడి పెళ్లి కోసం డబ్బు తెస్తానని మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయలు దేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు.

కరమ్ సింగ్(70) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడు. కుమారుడి పెళ్లి కోసం డబ్బు తెస్తానని మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయలు దేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు.

కరోనా వైరస్, లాక్‌డౌన్ దెబ్బకు కోట్లాది మంది బతుకులు ప్రభావితం అయ్యాయి. వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. అయితే, లాక్‌డౌన్ కొందరికి మంచి కూడా చేసింది. ఓ తండ్రిని కుమారులకు దగ్గర చేసింది.. కుమారులకు తండ్రిని అందించింది.

కరమ్ సింగ్(70) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడు. కుమారుడి పెళ్లి కోసం డబ్బు తెస్తానని మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయలు దేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు. చాలా రోజులు వేచి చూసి చనిపోయాడేమో అనుకున్నారు. కానీ, తెలీకుండా బెంగళూరు రైలెక్కిన కరమ్ సింగ్ కర్ణాటకలోని మైసూరుకు చేరాడు. ఆ జర్నీ వల్ల అతడిలో టెన్షన్ పెరిగి.. గతాన్ని మర్చిపోయాడు. మైసూరు వీధుల్లో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగించాడు. అయితే, లాక్‌డౌన్ విధించడంతో అతడ్ని ఓల్డేజ్ హోమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ చికిత్స వల్ల కోలుకున్న అతడికి గతం గుర్తుకువచ్చింది. తాను అనాథను కాదని, తనకు ఇల్లు ఉందని చెప్పాడు.

ఆ వివరాలను బట్టి పోలీసులు ఉత్తరప్రదేశ్ అధికారులను సంప్రదించగా.. వాళ్లు కరమ్ సింగ్ కుటుంబాన్ని సంప్రదించారు. దీంతో.. అతడు తమ తండ్రేనని చెప్పారు. తమ తండ్రిని తమకు అప్పగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కరమ్ సింగ్‌ను యూపీకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

First published:

Tags: Bangalore, Lockdown, Uttar pradesh

ఉత్తమ కథలు