news18-telugu
Updated: June 23, 2020, 7:50 AM IST
PTI Photo
యోగా గురువు బాబా రామ్దేవ్ సంస్థ పతంజలి, ఆయుర్వేద కరోనా వైరస్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పతంజలి యోగ్పీట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఆచార్య బాలకృష్ణ ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. కరోనా ఆయుర్వేద ఔషధం కరోనైల్(Coronil) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరిద్వార్లోని పతంజలి యోగ్పీట్ లో ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సమయంలో, మొదటి ఆయుర్వేద ఆధారిత ఆయుర్వేద ఔషధం కరోనిల్ గురించి పూర్తి శాస్త్రీయ వివరాలు కూడా పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో బాబా రామ్దేవ్ కూడా హాజరుకానున్నారు.
First published:
June 23, 2020, 7:25 AM IST