హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!

Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి.  ఇటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి.  ఇటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి.  ఇటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌లో మరోసారి కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.  దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు (Covid-19) పెరుగుతున్నాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ  క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేంద్రం లేఖ రాసిన ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి.

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది.

దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌లో అత్యధిక సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దేశంలో 754 కొత్త కేసులు రికార్డయ్యాయి.  ఇటు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు వేసవిలో కూడా కోవిడ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. 

First published:

Tags: Corona casess, Covid cases, Hyderabad

ఉత్తమ కథలు