అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని తెలిసిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అలాంటి వారికి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. చుట్టూ ఉన్న సమాజానికి ఎవరూ నష్టం చేయొద్దని ఆయన హితవు పలికారు. 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న ఏపీ డీజీపీ... వీరంతా వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము చేస్తున్న ప్రయత్నం ప్రజల కోసమే అని తెలుసుకోవాలని సూచించారు. పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణలో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. వైరస్ వ్యాప్తి చెయిన్ను బ్రేక్ చేద్దామని తెలిపారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్కు వెళ్లాలని ఏపీ డీజీపీ సవాంగ్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Coronavirus, Covid-19, Gautam Sawang