CovidUpdates : ఏపీలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 12 గంటల్లో అనంతపురంలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 892 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 365 కేసులు నమోదు కాగా, 10 మంది డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 349 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే అనంతపూర్లో 15, చిత్తూరులో 20, తూర్పు గోదావరిలో 12, గుంటూరులో 51, కడపలో 29, కృష్ణాలో 35, కర్నూలులో 75, నెల్లూరులో 48, ప్రకాశంలో 38, శ్రీకాకుళంలో సున్నా, విశాఖపట్నంలో 20, విజయనగరంలో సున్నా, పశ్చిమ గోదావరిలో 22 కేసులు నమోదయ్యాయి.
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో అనంతపూర్ జిల్లా లో 2 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి పెరిగింది.#ApFightsCorona #COVID19Pandemic pic.twitter.com/BHpM487Vqv
— ArogyaAndhra (@ArogyaAndhra) April 10, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapur S01p19, AP News, Corona, Coronavirus, Covid-19