హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Update : ఊపిరి పీల్చుకో భారత్..40వేల దిగువకు యాక్టివ్ కేసులు

Covid Update : ఊపిరి పీల్చుకో భారత్..40వేల దిగువకు యాక్టివ్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid Update : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Covid Update : రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్(Corona Virus)పట్టిపీడిస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే భారత్(India) లో మాత్రం కరోనా కేసులు(Corona Cases)తగ్గిపోతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3947 కరోనా వైరస్ కేసులు,9మరణాలు(Covid Deaths)నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదన కేసుల్లో అత్యధికంగా 1445 కేసులు కేరళలోనే ఉన్నాయి. తమిళనాడులో 531, మహారాష్ట్ర 453, పశ్చిమబెంగాల్‌ 284, కర్ణాటకలో 266 మంది కరోనా బారినపడ్డారు.

ఇక,తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,87,307కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,629కు చేరింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 5,096 కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య4,40,19,095కి చేరుకుంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!

 దేశంలో ప్రస్తుతం 39,583 యాక్టివ్‌ కోవిడ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.09 శాతం కేసులు యాక్టివ్‌ గా ఉండగా, రికవరీ రేటు 98.73శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 1.23శాతంగా ఉంది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,21,962 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందిచగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 218.52 కోట్లకు చేరింది.

First published:

Tags: Corona cases, Corona deaths, Covid -19 pandemic

ఉత్తమ కథలు