news18-telugu
Updated: July 20, 2020, 11:39 AM IST
ఏపీ అసెంబ్లీ భవనం
ఏపీలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కోవిడ్-19 బారిన పడ్డ అసెంబ్లీ ఉద్యోగుల సంఖ్య 17కు చేరింది. ఇక మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కార్యాలయానికి వచ్చి పని చేసే పరిస్థితి లేకపోవడంతో తమకు కూడా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని అసెంబ్లీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక అసెంబ్లీ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగుల్లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో వారిలో పలువురు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 5041 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 56 మంది కరోనా వల్ల మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 22,890 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు నమోదైన మరణాలతో కలిపి రాష్ట్రంలో 642 మంది చనిపోయారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో 647, అనంతపురంలో 637, శ్రీకాకుళం 535 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా చిత్తూరు 440, కృష్ణా 397, పశ్చిమ గోదావరి 393, నెల్లూరు 391, కర్నూలు 364, గుంటూరు 354, విశాఖపట్నం 266, కడప 226, విజయనగరం 241, ప్రకాశం జిల్లాలో 150 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Published by:
Kishore Akkaladevi
First published:
July 20, 2020, 11:39 AM IST