కంగనా రనౌత్ చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలోనే వచ్చింది. ఆ విమానంలో కంగనా ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు భారీగా వెళ్లారు. కానీ, వారెవరూ కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి.
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎపిసోడ్తో విమానయాన సంస్థ ఇండిగోకు మొట్టికాయలు పడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏయివేషన్ ఆ సంస్థకు చీవాట్లు పెట్టింది. రెండు వారాలు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అసలు విషయానికి వస్తే ఇటీవల కంగనా రనౌత్ చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలోనే వచ్చింది. ఆ విమానంలో కంగనా వస్తుందని తెలుసుకున్న మీడియా ఛానల్స్ ప్రతినిధులు కూడా భారీ ఎత్తున అదే విమానంలో టికెట్లు కొన్నారు. తమ తమ టీవీ ఛానల్స్, అలాగే, పత్రికలకు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నాలు చేశారు. ఇంటర్వ్యూల హడావిడిలో వారు కరోనా నిబంధనలు పాటించలేదు. కేంద్ర విమానయాన నిబంధనల ప్రకారం విమానాల్లో ప్రయాణించే వారు మాస్క్లు, ఫేస్ కవర్లు తప్పనిసరిగా ధరించాలి. కానీ, ఆ విమానంలోని వారు అవేవీ చేయలేదు. ఈ విషయం డీజీసీఏ దృష్టికి వచ్చింది. దీంతో ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది. అదే సమయంలో అన్ని విమానయాన సంస్థలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఏ విమానయాన సంస్థ అయినా సరే కోవిడ్ నిబంధనలు పాటించకపోతే వారి మీద రెండు వారాల పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. కేంద్రం విధించిన కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఇకపై ఏం చేయబోతున్నారో చెప్పాలంటూ ఇండిగోకు లేఖ రాస్తూ, 15 రోజుల గడువులోగా సమాధానం చెప్పాలని కోరింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.