news18-telugu
Updated: December 10, 2019, 10:58 PM IST
ప్రతీకాత్మకచిత్రం
దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త వినిపించింది. ఎంఎన్పీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి కస్టమర్ తన మొబైల్ నంబర్ను ఎంఎన్పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే డిసెంబర్ 16వ తేదీ నుంచి అమలు చేయనున్న ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం 3 రోజుల్లోనే ఎంఎన్పీ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్కు ఎంఎన్పీ ద్వారా తమ ఫోన్ నంబర్ను పోర్ట్ చేయడం మరింత తేలికగానూ, వేగంగానూ అయిపోవడం విశేషం. కాగా ఒకే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్ను పోర్ట్ చేసుకోవచ్చని, వేరే సర్కిల్లో ఉన్న నెట్వర్క్కు ఫోన్ నంబర్ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుందని ట్రాయ్ తెలిపింది.
Published by:
Krishna Adithya
First published:
December 10, 2019, 10:58 PM IST