హోమ్ /వార్తలు /బిజినెస్ /

Climate Change: రేపు అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2021లో ప్రసంగించనున్న ముఖేష్ అంబానీ

Climate Change: రేపు అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2021లో ప్రసంగించనున్న ముఖేష్ అంబానీ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

గ్లోబల్ హైబ్రిడ్ సమ్మిట్ ద్వారా భారతదేశాన్ని స్వచ్ఛమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమావేశం నిలవనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం.

ఇంకా చదవండి ...

PDH ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (PDH Chamber of Commerce & Industry) , పర్యావరణ కమిటీ చొరవతో అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2021 (ICS 2021) 3 సెప్టెంబర్ 2021 న భారతదేశం ఓ ఈవెంట్‌ను నిర్వహించనుంది. గ్లోబల్ హైబ్రిడ్ సమ్మిట్ ద్వారా భారతదేశాన్ని స్వచ్ఛమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమావేశం నిలవనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ICS ఇన్వెస్ట్ ఇండియాతో భాగస్వామ్యమైంది.  ఈ శిఖరాగ్ర సమావేశాలను PHD ఛాంబర్, NITI ఆయోగ్, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, CSIR , సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

శిఖరాగ్ర సమావేశంలో, భారతదేశ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్, రెగ్యులేటర్లు, ఇండస్ట్రీ దిగ్గజాలు, నిపుణులు , శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ , జితేంద్ర సింగ్, NITI ఆయోగ్ సభ్యుడు డా. వాతావరణ మార్పుపై వర్చువల్ లీడర్స్ సమ్మిట్‌లో ఏప్రిల్ 2021 లో, ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికాతో కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారన్న సంగతి తెలిసిందే. జనవరి 2021 లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి ప్రపంచవ్యాప్త చొరవగా ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో భారతదేశం , అమెరికా 'క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్‌నర్‌షిప్' ప్రారంభిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇది పెట్టుబడి సమీకరణతో పాటు శుభ్రమైన సాంకేతికతలను వెలుగులోకి తేనున్నారు. వాతావరణాన్ని మెరుగుపరచడంలో జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను కూడా ఈ సమావేశంలో గుర్తు చేయనున్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన కార్బన్ విడుదల చేసే దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఇంకా గ్లోబల్ కార్బన్ అట్లాస్ ప్రాజెక్ట్ ప్రకారం, భారతదేశంలో తలసరి ఉద్గారాలు చాలా తక్కువగా ఉన్నాయి.

వాతావరణ మార్పు 'COP26' పై ప్రధాన సమావేశం గ్లాస్గోలో 31 అక్టోబర్ నుండి 12 నవంబర్ 2021 వరకు జరగాల్సి ఉంది. COP-26 అధ్యక్షుడు అలోక్ శర్మ ఇటీవల మాట్లాడుతూ, "ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు మించకుండా ఉండేలా ఇది చివరి అవకాశం." 2015 ఒప్పందం ప్రకారం, గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్ కంటే పరిమితం చేయడానికి ప్రపంచ నాయకులు అంగీకరించారు. 1980 నుండి, సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1.1 ° C కంటే ఎక్కువ పెరిగిందని మీకు తెలియజేద్దాం. ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ప్యానెల్ నివేదిక ప్రకారం గ్లోబల్ వార్మింగ్ నియంత్రణ నుండి బయటపడవచ్చు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచం మరిన్ని వాతావరణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుందని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) తెలిపింది.

First published:

Tags: RIL

ఉత్తమ కథలు