Electric Cycle: దేశంలో గత ఒక సంవత్సర కాలం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల విభాగం (EV) వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా Nexzu మొబిలిటీ అనే సంస్థ ఎలక్ట్రిక్ బై-సైకిల్ను ఆవిష్కరించింది. దీన్ని అటు సైకిల్ గానూ, ఎలక్ట్రిక్ టూవీలర్ బైక్ గానూ వాడవచ్చు. అంటే చార్జింగ్ అయిపోతే ఈ సైకిల్ ను మీరు తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు. సింగిల్ ఛార్జ్లో 100 కిమీల డ్రైవింగ్ చేయవచ్చని, Nexzu Mobility కంపెనీ పేర్కొంది. ఇ-సైకిల్స్ బేస్ వేరియంట్ ధర రూ. 49,445 కాగా, హై-ఎండ్ , కార్గో ఇ-సైకిల్స్ ధర రూ.51,525గా నిర్ణయించారు. పురుషులు , మహిళలు ఇద్దరూ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను నడపవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బైక్లో Li-ion బ్యాటరీ సామర్థ్యంతో నడుస్తుంది. దీన్ని తొలగించగల అంటే వేరు చేయగలిగిన రూపంలో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రైడర్ తో సహా ఈ సైకిల్పై 15 కిలోల అదనపు భారాన్ని మోయవచ్చు. ఇ-సైకిల్లో రైడర్ల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంది. రైడర్ పెడల్స్ను ఉపయోగించాలనుకుంటే, అలా కూడా చేయవచ్చు. అలాగే, కంపెనీ ఈజీ పేమెంట్ సిస్టమ్తో దీన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం జెస్ట్ మనీతో కంపెనీ టైఅప్ చేసుకుంది. బుకింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్లైన్లో చేయొచ్చు
హీరో , ఇ-సైకిల్ పోటీపడుతుంది
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ హీరో లెక్ట్రో గత సంవత్సరం డిసెంబర్లో తన సరికొత్త డిజైన్తో రూపొందించిన రెండు సైకిళ్లను ఆవిష్కరించింది. వీటికి F2i , F3i ఎలక్ట్రిక్ మౌంటైన్ సైకిల్ (MTBS) అని పేరు పెట్టారు. కంపెనీకి చెందిన ఈ బైక్లు బ్లూటూత్ , స్మార్ట్ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పట్టణ ట్రాక్లు అలాగే ఆఫ్-రోడ్ ట్రాక్లపై సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందించడానికి రూపొందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.