ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆరో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల (Sovereign Gold Bond) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు 5 రోజుల పాటు ఈ బాండ్లు తెరిచి ఉంటాయి. కొనుగోలు చేసిన గోల్డ్ బాండ్లకు (Gold Bonds) సెప్టెంబర్ 7న సర్టిఫికెట్ జారీ చేస్తారు. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం (Gold Price) కొనడానికి ఇది మంచి అవకాశం. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్స్ సరైన ఆప్షన్. ఆభరణాల కోసం అయితే ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లను భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని కొనుగోలు చేసేవారు, వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు.
New Rules in September: సెప్టెంబర్లో గుర్తుంచుకోవాల్సిన 7 కొత్త రూల్స్ ఇవే
ఈ విడతలో ఒక గ్రాము బంగారం ధరను రూ. 4,732గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర రూ.4,849. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కొత్త ఈ–సేవా పోర్టల్ http://onlinesbi.com ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఎస్బీఐ పేర్కొంది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే వారికి నామినల్ వాల్యూపై గ్రాముకు రూ.50 తగ్గింపు అందిస్తోంది. డిజిటల్ మోడ్లో పెట్టుబడి పెట్టేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ కింద గ్రాము గోల్డ్ బాండ్ ఇష్యూ ధర కేవలం రూ. 4,682 గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
EPFO Aadhaar Link: ఈపీఎఫ్-ఆధార్ నెంబర్ లింకింగ్కు 2 రోజులే గడువు... వెంటనే ఇలా చేయండి
ఎస్జీబీల్లో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అలాగే, బంగారం విషయంలో ఇరత ఛార్జీలు, స్వచ్ఛత వంటి సమస్యల ఉండవు. ఇవి కాకుండా, ఎస్జీబీలను ఆర్బీఐ డీమ్యాట్ రూపంలో నిర్వహిస్తారు.
ఎ) విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999 కింద భారతదేశంలో నివసించే ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.
బి) హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు.
సి) మైనర్ల తరపున వారి సంరక్షకులు మైనర్ ఎస్జీబీల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
Bank Holidays: సెప్టెంబర్లో బ్యాంకులకు 12 సెలవులు... ఎప్పుడెప్పుడంటే
జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), అధీకృత స్టాక్ ఎక్స్ఛేంజీల కార్యాలయాలు లేదా శాఖలు.
ఎస్జీబీలో కనీసం ఒక గ్రాము పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఇక వ్యక్తులైతే గరిష్టంగా 4 కేజీల వరకు , హెచ్యూఎఫ్లు 4 కేజీలు, ట్రస్ట్లు 20 కేజీల వరకు పెట్టుబడికి అనుమతి ఉంటుంది.
ఎస్జీబీలు సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 లో 43) నిబంధనల ప్రకారం, ఎస్జీబీలపై వడ్డీ మినహాయింపు ఉంటుంది. అయితే ఈ బాండ్పై TDS వర్తించదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold price, Gold rate, Gold rate hyderabad, Personal Finance, Sovereign Gold Bond Scheme