హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్ గుర్తుంచుకోండి... ఈ స్టెప్స్ ఫాలో అవండి

SBI Alert: ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్ గుర్తుంచుకోండి... ఈ స్టెప్స్ ఫాలో అవండి

SBI Alert: ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్ గుర్తుంచుకోండి... ఈ స్టెప్స్ ఫాలో అవండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్ గుర్తుంచుకోండి... ఈ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా అన్ని బ్యాంకులు ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఈ కొత్త రూల్స్ పాటించాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల్లో చెక్స్ క్లియరెన్స్ కోసం కొత్త రూల్స్ అమలు చేయాలని బ్యాంకులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.5,00,000 లేదా అంతకన్నా ఎక్కువ వ్యాల్యూ ఉన్న చెక్స్ ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ (Positive Pay System) పాటించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా బ్యాంకులన్నీ ఈ రూల్ పాయించాల్సిందే. రూ.5,00,000 లోపు చెక్స్‌కి కూడా ఈ రూల్ పాటించవచ్చు. కానీ ఇది తప్పనిసరి కాదు. కానీ రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్స్‌కి మాత్రం పాజిటీవ్ పే సిస్టమ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పాజిటీవ్ పే సిస్టమ్‌ను రూపొందించింది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకు ఓ కస్టమర్ ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇచ్చారనుకుందాం. ఆ చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంకు సిబ్బంది దగ్గరకు వెళ్లినప్పుడు వెంటనే చెక్ ఎన్‌క్యాష్ చేయకుండా కస్టమర్ నుంచి చెక్‌పైన ఉన్న వివరాలను నిర్థారించుకుంటారు. అయితే అంతకన్నా ముందే కస్టమర్ ఆ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా బ్యాంకుకు వెల్లడించాల్సి ఉంటుంది. చెక్ పైన ఉన్న వివరాలు, కస్టమర్ ఇచ్చిన వివరాలు మ్యాచ్ అయితేనే చెక్ క్లియర్ అవుతుంది. లేకపోతే బ్యాంకు ఆ చెక్‌ను తిరస్కరిస్తుంది.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

ఆర్‌బీఐ పాజిటీవ్ పే సిస్టమ్‌ను 2021 జనవరి 1న అమలు చేస్తూ రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ విధానం పాటించాలని సూచించింది. ఇది తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ రూల్ పాటించాల్సిందే. మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే పాజిటీవ్ పే సిస్టమ్ ఎలా పాటించాలో తెలుసుకోండి.

New Rules in August: నేటి నుంచి ఈ కొత్త రూల్స్... అన్నీ మీ డబ్బుకు సంబంధించినవే


ఎస్‌బీఐ కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాలి ఇలా


Step 1- ముందుగా https://retail.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- Personal Banking సెక్షన్‌లో లాగిన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 4- కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 5- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 6- ఆ తర్వాత హోమ్ పేజీలో Request & Enquiries పైన క్లిక్ చేయాలి.

Step 7- ఆ తర్వాత Cheque Book Services పైన క్లిక్ చేయాలి.

Step 8- ఆ తర్వాత Positive Pay System పైన క్లిక్ చేయాలి.

Step 9- రిజిస్ట్రేషన్ ట్యాబ్ కింద అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 10- ఆ తర్వాత స్క్రీన్ పైన వివరాలన్నీ కన్ఫామ్ చేయాలి.

Step 11- అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ పైన ఉన్న తేదీ, అమౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్, బెనిఫీషియరీ పేరు, ఎంఐసీఆర్ కోడ్ లాంటి వివరాలను సరిచూసుకొని కన్ఫామ్ చేయాలి.

Step 12- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి మళ్లీ Confirm పైన క్లిక్ చేయాలి.

First published:

Tags: Cheque, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు