హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI News: మళ్లీ షాక్ ఇచ్చిన ఆర్‍‌బీఐ... భారీగా వడ్డీ రేట్లు పెంపు... పెరగనున్న ఈఎంఐలు

RBI News: మళ్లీ షాక్ ఇచ్చిన ఆర్‍‌బీఐ... భారీగా వడ్డీ రేట్లు పెంపు... పెరగనున్న ఈఎంఐలు

RBI News: మళ్లీ షాక్ ఇచ్చిన ఆర్‍‌బీఐ... భారీగా వడ్డీ రేట్లు పెంపు... పెరగనున్న ఈఎంఐలు
(ప్రతీకాత్మక చిత్రం)

RBI News: మళ్లీ షాక్ ఇచ్చిన ఆర్‍‌బీఐ... భారీగా వడ్డీ రేట్లు పెంపు... పెరగనున్న ఈఎంఐలు (ప్రతీకాత్మక చిత్రం)

అనుకున్నట్టుగానే మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను భారీగా పెంచింది. రెపో రేట్ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam | Tirupati | Vijayawada

అనుకున్నట్టుగానే మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను భారీగా పెంచింది. రెపో రేట్ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. మూడు రోజులుగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఈసారి రెపో రేట్ 35 బేసిస్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తే ఆర్‌బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. 100 బేసిస్ పాయింట్స్ ఒక శాతం లేదా ఒక రూపాయితో సమానం. అంటే ఇప్పుడు 50 పైసలు వడ్డీ రేటు పెరిగింది.

ఆర్‍బీఐ ఈ ఏడాది రెండుసార్లు రెపో రేట్ పెంచింది. మే 4న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 8న మరోసారి ఆర్‌బీఐ రెపో రేట్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 8న ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. అంటే మొత్తం 140 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెరిగింది. అంటే 1.40 శాతం వడ్డీ పెరిగింది.

Pension Scheme: నెలకు రూ.50,000 పెన్షన్ కావాలంటే ఎంత పొదుపు చేయాలో తెలుసా?

రెపో రేట్లు అంటే వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అనే నిర్ణయాన్ని రెండు నెలలకు ఓసారి ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ తీసుకుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి, దేశంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్‌బీఐ దశలవారీగా 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీ రేట్లు పెంచుతోంది ఆర్‌బీఐ.

ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ఇప్పుడు రెపో రేట్ 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి.

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16.26 లక్షల రిటర్న్స్

ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.

ఉదాహరణకు హోమ్ లోన్ కస్టమర్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకొని 7 శాతం వడ్డీతో ఈ ఏడాది ప్రారంభంలో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. మొత్తం 140 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగింది కాబట్టి వడ్డీ 8.40 శాతానికి చేరుకుంటుంది. దీంతో ఇప్పటికే చెల్లిస్తున్న హోమ్ లోన్ ఈఎంఐ కాస్త పెరుగుతుంది. అయితే వెంటనే కాకపోయినా మూడు నెలలకు ఓసారి వడ్డీ రీసెట్ చేస్తారు కాబట్టి త్వరలోనే ఈఎంఐ భారం అవుతుంది.

First published:

Tags: Interest rates, Personal Finance, Rbi, Repo rate, Reserve Bank of India

ఉత్తమ కథలు