హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railways: ట్రైన్ లో బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి.. వెతికి అందించిన అధికారులు.. ఫొటోలు వైరల్

Indian Railways: ట్రైన్ లో బొమ్మను పోగొట్టుకున్న చిన్నారి.. వెతికి అందించిన అధికారులు.. ఫొటోలు వైరల్

చిన్నారికి బొమ్మ అందిస్తున్న రైల్వే అధికారులు (ఫొటో: ట్విట్టర్)

చిన్నారికి బొమ్మ అందిస్తున్న రైల్వే అధికారులు (ఫొటో: ట్విట్టర్)

ట్రైన్ లో ఓ చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను అధికారులు వెతికి పట్టుకుని ఆ చిన్నారికి అందించి ఆనందం నింపిన ఘటన తాజాగా వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India

సాధారణంగా రైళ్లు (Trains), బస్సుల్లో (Buses) ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే.. వస్తువులు పోవడమే కానీ.. మళ్లీ దొరకడం చాలా కష్టం. ఈ ఆలోచనతోనే చిన్న చిన్న వస్తువులు పోయినప్పుడు మనలో చాలా మంది ఎలాగు దొరకవు కదా అనుకుని వదిలేస్తూ ఉంటారు. అయితే.. ట్రైన్ లో ఓ చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను అధికారులు వెతికి పట్టుకుని ఆ చిన్నారికి అందించి ఆనందం నింపిన ఘటన తాజాగా వైరల్ గా (Viral) మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4న సికింద్రాబాద్-అగర్తల ట్రైన్ (Train No.07030)లో ప్రయాణిస్తున్న ఓ 19 నెలల చిన్నారి ఓ బొమ్మను పోగొట్టుకుంది. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకోవడంతో ఏడుస్తున్న ఆ చిన్నారిని గమనించిన మరో ప్రయాణికుడు రైట్ మదన్ యాప్ సహాయంతో 139 నంబర్ కు ఫోన్ చేశాడు.

దీంతో స్పందించిన రైల్వే అధికారులు పశ్చిమ బెంగ్ లోని న్యూజలపాయిగురి స్టేషన్ ప్రాంతంలో ఆ బొమ్మను గుర్తించారు. ఆ పాప అడ్రస్ ను వెతికి పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ లోని ఖాజీగావ్ లో ఆ పాప చిరునామాను గర్తించిన అధికారులు ఇంటికి వెళ్లి మరీ ఆ బొమ్మను అందించారు.

Saves Passenger Life: విమాన ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు.. రక్షించిన భారత సంతతికి చెందిన వైద్యుడు..

దీంతో ఆ పాప ఆనందానికి అవదుల్లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కళ్లల్లో ఆనందం నింపిన రైల్వే అధికారులను అభినందిస్తున్నారు.

First published:

Tags: Indian Railways, South Central Railways, Viral photo

ఉత్తమ కథలు