జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ (Nissan Motor) ఇండియాలో ఇప్పటికే మాగ్నైట్, కిక్స్ వంటి ఎంట్రీ లెవల్ కార్లను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ భారత్లో తొలిసారిగా మూడు గ్లోబల్ మోడల్ ఎస్యూవీలు (Global SUVs) తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎక్స్-ట్రైల్ (X-Trail), కష్కాయ్ (Qashqai), జూక్(Juke)గా పిలిచే ఈ గ్లోబల్ కార్లలో ప్రస్తుతం రెండు ఎస్యూవీలు టెస్టింగ్ దశలో ఉన్నాయి. వీటిలో ఎక్స్-ట్రైల్ మొదటగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. నిస్సాన్ ఇండియా అక్టోబర్ 18న ప్రదర్శించిన నిస్సాన్ కష్కాయ్, నిస్సాన్ జూక్ మైల్డ్ హైబ్రిడ్ SUVలుగా అందుబాటులోకి వస్తాయి. అయితే ఇండియన్ మార్కెట్లో వీటి రిలీజ్ డేట్ను కంపెనీ వెల్లడించలేదు. ఎక్స్-ట్రైల్ లాంచ్ అయిన తర్వాత వీటిని పరిచయం చేసే అవకాశం ఉంది.
ఎక్స్-ట్రైల్, కష్కాయ్, జూక్ గ్లోబల్ కార్లు ఇండియన్ రోడ్లపై ఎలా పర్ఫార్మ్ చేస్తాయో తెలుసుకోవడం కోసం నిస్సాన్ ఇండియా టెస్టింగ్ జరుపుతోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్, నిస్సాన్ కష్కాయ్ కార్లను భారతీయ రోడ్లపై తిప్పుతోంది. టెస్టింగ్ ప్రాసెస్లో భాగంగా ఇండియాలోని విభిన్న భూభాగాలకు ఈ కార్లు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలుసుకుంటోంది. ఇవే పరీక్షలలో కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ప్రతి వాహనం సామర్థ్యాన్ని అంచనా వేస్తోంది. ఈ నెల నుంచి X-Trail, Qashqai రెండింటినీ చెన్నైలోని కంపెనీ తయారీ కర్మాగారం చుట్టూ ఉన్న రోడ్లపై నిస్సాన్ టాప్ ఇంజనీర్లు డ్రైవ్ చేస్తూ పరీక్షిస్తారు.
YouTube: యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక అందరికీ ఆ యాక్సెస్
నిస్సాన్ జూక్ విషయానికొస్తే దీనికి ఇండియన్ కస్టమర్ల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూసి ఆపై భారతీయ రోడ్లపై టెస్ట్ చేసి మార్కెట్లో పరిచయం చేయవచ్చు. నిస్సాన్ జూక్ 115 bhp, 200 Nm ఓవర్బూస్ట్తో 1.0-లీటర్ మూడు సిలిండర్ ఇంజన్తో వస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ లేదా పాడిల్ షిఫ్టర్లతో ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ DCTని ఇందులో ఆఫర్ చేశారు.
Tax on Diwali Gifts: దీపావళికి బోనస్ వచ్చిందా? గిఫ్ట్ తీసుకున్నారా? ట్యాక్స్ చెల్లించాలి
టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత, ఎక్స్-ట్రైల్ను ముందుగా అమ్మకానికి తీసుకొస్తారు, ఆ తర్వాత భారతదేశంలోని ఇతర మోడళ్లను ప్రవేశపెడతారు. ఇండియాలో 5-సీట్లు లేదా 7-సీట్లతో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక ప్రీమియం ఎగ్జిక్యూటివ్ SUVగా లాంచ్ కావచ్చు. ఇది వోక్స్వ్యాగన్ టిగువాన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి పోటీ ఇస్తుంది. ఈ వాహనాల పర్ఫామెన్స్ అంచనా వేయడం ద్వారా కంపెనీ ఇండియాలో స్ట్రాంగ్ ఫ్యూచర్ ఏర్పరచుకోవడం సాధ్యమవుతుంది. ఈ గ్లోబల్ కార్ల ఆవిష్కరణ సందర్భంగా నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ మాట్లాడుతూ, నేటి భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ వాహనాలను పరిచయం చేయడం ముఖ్యమని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.