దేశంలో కొత్త ఉద్యోగాల సంఖ్య భారీగా పెరిగింది. జూలై నెలలో 15 లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చాయి. వాస్తవానికి ఈ ఏడాది మేలో ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలో దాదాపు 15.72 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక గణాంకాలు వెల్లడించింది. దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి స్థితిగతులను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) 'పే-రోల్ రిపోర్టింగ్ ఇన్ ఇండియా- ఎంప్లాయ్మెంట్ సినారియో-జూలై-2022' పేరుతో విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ESICలో 1.49 కోట్ల కొత్త నమోదులు జరిగాయి.
నివేదిక ప్రకారం ESIC పథకం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.49 కోట్ల కొత్త ఎన్రోల్మెంట్లు జరిగాయి. ఈ సంఖ్య 2020-21లో 1.15 కోట్లు, 2019-20లో 1.51 కోట్లు, 2018-19లో 1.49 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు దాదాపు 83.35 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు ESIC ప్లాన్లలో చేరారు. సెప్టెంబర్ 2017 నుండి జూలై 2022 వరకు మొత్తం 7.08 కోట్ల కొత్త ఎన్రోల్మెంట్లు ESIC పథకం కింద జరిగాయని నివేదిక పేర్కొంది.
ESIC ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించబడుతున్న వివిధ సామాజిక భద్రతా పథకాలలో చేరిన కొత్త చందాదారుల డేటా ఆధారంగా NSO నివేదికలు రూపొందించబడ్డాయి.
Cyber Crime: బ్యాంకింగ్, సైబర్ మోసాల నివారణపై కేంద్రం ఫోకస్.. త్వరలోనే కొత్త బిల్లు
Stock Market: వరుసగా మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ పతనం అగేది ఎక్కడ ?
సెప్టెంబర్ 2017 నుండి జూలై 2022 వరకు దాదాపు 5.7 కోట్ల కొత్త సబ్స్క్రైబర్లు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో చేరారు. వివిధ మూలాల నుండి వస్తున్న చందాదారుల సంఖ్య కారణంగా వాటిలో డూప్లికేషన్ ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.