ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ సంస్థ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్న పెట్టుబడులకు సంబంధించి వారిమధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ముఖేష్ అంబానీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీని, అనంత్ అంబానీని సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలికారు. వారిద్దరినీ శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు.
అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీకి స్వాగతం పలికారు. ముఖేష్, అనంత్ అంబానీలకు శాలువాలు కప్పిన విజయసాయిరెడ్డి జ్ఞాపికను బహూకరించారు.
క్యాంప్ ఆఫీసులో జగన్తో కొద్దిసేపు చర్చించిన తర్వాత ముఖేష్ అంబానీ తిరుగు ప్రయాణమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mukesh Ambani, Reliance Industries, Reliance Jio