దేశీయ చమురు కంపెనీ సామాన్య ప్రజలకు ఇటీవల వరుగా షాక్లు ఇచ్చాయి. సిలిండర్ ధరలను పెంచుతూ పొతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ పెద్ద నిర్ణయం తీసుకొంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్కు (12 సిలిండర్ల వరకు) ₹ 200 సబ్సిడీని అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది దేశంలోనే ఎందరో మహిళలకు సాయం చేస్తుందని ఆమె అన్నారు.
9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఎగబాకుతుండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు భారం పడుతోందని గగ్గోలు పెడుతున్నారు. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలో విషయంలో నిర్ణయం తీసుకొన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.