పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో రూ.50 వేలకు అమ్ముతారు. ఇది చదివి షాకయ్యారా? అక్షరాలా నిజం. పునుగు పిల్లి మలంతో చేసే కాఫీ పౌడర్కు అంత డిమాండ్ ఉంటుంది. దీన్నే 'సివెట్ కాఫీ' లేదా 'కోపీ లువాక్' అని పిలుస్తారు. ఆసియాలో కాఫీ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశానిది మూడో స్థానం. ఈ ఖరీదైన కాఫీ తయారయ్యేది కూడా మన భారతదేశంలోనే. ఎక్కడో కాదు... మన పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని కొడగు(కూర్గ్) జిల్లాలో ఈ కాఫీని తయారు చేస్తారు.
సివెట్ కాఫీ ఎలా తయారుచేస్తారు?
అసలు ఈ కాఫీ పొడి తయారయ్యే విధానమే విచిత్రంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జనతోనే ఈ కాఫీ పొడి తయారవుతుంది. కాఫీ గింజల్ని పునుగు పిల్లి తిని మలాన్ని విసర్జిస్తుంది. పునుగు పిల్లి విసర్జనను సేకరించి కాఫీ పొడి తయారు చేసి అమ్ముతారు. ఈ కాఫీ పొడిలో పోషకాలు ఎక్కువ ఉంటాయన్న వాదన ఉంది. అందుకే అంత ఖరీదు ఉంటుందని చెబుతారు. సంపన్నవర్గాల్లో ఈ కాఫీ పొడికి డిమాండ్ ఎక్కువ. గల్ఫ్, యూరప్ దేశాలకు ఇండియా నుంచి ఎగుమతి అవుతుంది.
సివెట్ కాఫీ ఎందుకంత ఖరీదు?
పునుగు పిల్లి విసర్జనతో చేసే కాఫీ పొడికి ఇంత డిమాండ్ ఉండటంతో కూర్గ్లో లగ్జరీ కాఫీ తయారీ చిన్నతరహా పరిశ్రమగా మారిపోయింది. గతంలో ఏడాదికి 20 కిలోల కాఫీ మాత్రమే తయారుచేసేవాళ్లు. డిమాండ్ పెరుగుతున్నకొద్ది ఉత్పత్తి కూడా పెరిగింది. పునుగు పిల్లుల్ని పెంచుతూ, వాటికి కాఫీ గింజలు తినిపిస్తూ మలాన్ని సేకరించి కాఫీ పొడి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏడాదికి సుమారు 500 కిలోల వరకు సివెట్ కాఫీ తయారవుతుందని అంచనా. ఈ కాఫీ పొడి కేజీ ధర క్వాలిటీని బట్టి రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుందని అంచనా. స్థానికంగా కిలో ధర రూ.8,000. కూర్గ్లోని ‘Ainmane’ ఔట్లెట్లో ఈ కాఫీ దొరుకుతుంది.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.