మీకు ప్రయాణాలు చేయడం అంటే ఇష్టమా? అందులోనూ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ట్రావెలింగ్పై మీకు ఉన్న ఆసక్తితో ఓ వీడియో రూపొందించి రూ.1,00,000 వరకు గెలుచుకోవచ్చు. భారతీయ రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సేవల్ని అందించే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఓ కాంటెస్ట్ ప్రారంభించింది. ఈ కాంటెస్ట్లో గెలిస్తే రూ.1,00,000 సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం CoRover అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి వ్లాగింగ్ కాంటెస్ట్ ప్రారంభించాయి. విజేతలకు రూ.1,00,00 ప్రైజ్ మనీ ఇవ్వనున్నాయి. ఈ కాంటెస్ట్కు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో వెల్లడించింది ఐఆర్సీటీసీ. ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి 2021 ఆగస్ట్ 31 చివరి తేదీ.
ఈ కాంటెస్ట్లో పాల్గొనేవారు చేయాల్సిందల్లా వీడియోలు క్రియేట్ చేయడమే. భారతదేశంలో ఏదైనా పర్యాటక ప్రాంతం గురించి లేదా భారతీయ రైళ్ల గురించి లేదా భారతీయ రైల్వే గురించి లేదా ఐఆర్సీటీసీ అందించే టికెటింగ్, టూరిజం లాంటి సేవల గురించి వివరిస్తూ ఓ వీడియో రూపొందించాలి. ఆ వీడియోను సబ్మిట్ చేయాలి. ఈ పోటీలో పాల్గొనేవారు https://corover.ai/vlog/ వెబ్సైట్లో ఆన్లైన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకరు ఎన్ని వీడియోలైనా రూపొందించొచ్చు. వీడియోలో లైవ్ షూటింగ్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉండాలి. రెండూ కలిపి వీడియో రూపొందించొచ్చు. ఎంపికైన వీడియోలను ఐఆర్సీటీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తారు. ఆ వీడియో రూపొందించినవారి పేరు కూడా డిస్స్క్రిప్షన్లో ఉంటుంది.
ఈ కాంటెస్ట్లో గెలిచినవారికి రూ.1,00,000 రివార్డ్ లభిస్తుంది. దీంతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ కూడా లభిస్తుంది. రన్నరప్కు రూ.50,000, సర్టిఫికెట్, ట్రోఫీ, సెకండ్ రన్నరప్కు రూ.25,000 సర్టిఫికెట్, ట్రోఫీ ఇస్తారు. వీడియో క్వాలిటీ, కంటెంట్ను పరిగణలోకి తీసుకొని 300 మంది విజేతల్ని ప్రకటిస్తుంది ఐఆర్సీటీసీ. మొదటి ముగ్గురికి తప్ప మిగతావారికి గిఫ్ట్ కార్డ్స్, రూ.500, సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రకటించింది ఐఆర్సీటీసీ.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.