హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Sector: బీమా కంపెనీలకు షాక్ ఇచ్చిన బడ్జెట్.. భారీగా పడిపోయిన షేర్లు..

Insurance Sector: బీమా కంపెనీలకు షాక్ ఇచ్చిన బడ్జెట్.. భారీగా పడిపోయిన షేర్లు..

నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2023: కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీమా కంపెనీల వ్యాపారాన్ని నిరుత్సాహపరుస్తుందని బీమా రంగం విశ్లేషకులు అంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క రెండవ టర్మ్ చివరి పూర్తి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఉద్యోగ వృత్తుల నుండి పేద రైతులు మరియు మహిళల వరకు ఆర్థిక మంత్రి అనేక ప్రకటనలు చేశారు. మధ్యతరగతి, ఉద్యోగస్తులకు పన్నుల విషయంలో ఉపశమనం లభించింది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను విధించబోమని ప్రకటించారు. బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలు సంతోషించవచ్చు కానీ బీమా కంపెనీలకు బడ్జెట్‌ షాక్ ఇచ్చింది. ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy) ప్రీమియంపై పన్ను మినహాయింపు, కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నందున LICతో సహా అన్ని పెద్ద కంపెనీల షేర్లు పడిపోయాయి.

కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీమా కంపెనీల వ్యాపారాన్ని నిరుత్సాహపరుస్తుందని బీమా రంగంపై(Insurance Sector) నిఘా ఉంచిన విశ్లేషకులు అంటున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80C కింద మినహాయింపు పొందేందుకు మాత్రమే బీమా పాలసీలను కొనుగోలు చేస్తారు. కొత్త పన్ను విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటే, ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు దానిని ఎంచుకుంటారు, అప్పుడు బీమా పాలసీల(Insurance Sector) విక్రయం ప్రభావితం అవుతుంది.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అధిక-విలువ బీమా పాలసీల ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపును పరిమితం చేశారు. ఏప్రిల్ 1, 2023 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా(Life Insurance) పాలసీలు మొత్తం ప్రీమియం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అటువంటి పాలసీల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే మినహాయింపు ఉంటుందని బడ్జెట్ పేర్కొంది. 5 లక్షల కంటే తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలపై డిస్కౌంట్ అందుబాటులో ఉండదు. బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తంపై పన్ను మినహాయింపుపై దీని ప్రభావం ఉండదని బడ్జెట్‌లో పేర్కొంది. దీనితో పాటు మార్చి 31, 2023కి ముందు జారీ చేయబడిన బీమా పాలసీలు ప్రభావితం కావు.. అంటే పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడం కొనసాగుతుంది.

Budget 2023: వేతన జీవులకు బడ్జెట్‌లో రిలీఫ్.. టేక్ హోమ్ శాలరీపై ప్రభావం ఇదే..

Budget: ఎక్కడో కాలుతుంది...! పొగరాయుళ్ళకు కేంద్రం షాక్‌

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాతే బీమా కంపెనీల షేర్లలో క్షీణత కనిపించింది. ఎల్‌ఐసి షేర్లు భారీగా పతనమై మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్‌ఎస్‌ఇలో 8 శాతం క్షీణించి రూ.601 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో ఇంట్రాడేలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు 10 శాతం క్షీణించి రూ.1,097.95కు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 9.88 శాతం క్షీణించి రూ.407.50కి, హెచ్‌డిఎఫ్‌ఎస్ లైఫ్ ఇన్సూరెన్స్ 11 శాతం క్షీణించి రూ.515కి పడిపోయాయి. ఇంట్రాడేలో జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు 14 శాతం క్షీణించి రూ.158కి చేరుకున్నాయి.

First published:

Tags: Budget 2023, Life Insurance

ఉత్తమ కథలు