INDIA SET TO MAKE FLEX FUEL ENGINES MANDATORY DECISION TO BE TAKEN IN 8 10 DAYS TIME MK
Flex Fuel engine అంటే ఏంటి..కేంద్ర ప్రభుత్వం త్వరలో ఏం చేయబోతోంది...
ప్రతీకాత్మకచిత్రం
ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి నడుమ ఫ్లెక్స్ ఇంజన్ అంటే ఫ్లెక్సిబుల్ ఇంజన్ కారు చర్చ కూడా జోరందుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్పై ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది.
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతకడం ప్రారంభించారు. దీంతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి నడుమ ఫ్లెక్స్ ఇంజన్ అంటే ఫ్లెక్సిబుల్ ఇంజన్ కారు చర్చ కూడా జోరందుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్పై ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఆటోమొబైల్ పరిశ్రమ సైతం ఈ ఇంజన్ ను తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేయబోతోంది. ఒకవైపు డబ్బు ఆదా అవుతుంది, మరోవైపు కాలుష్యం కలిగించే శిలాజ ఇంధనాలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. దీంతో దేశంలో కాలుష్య స్థాయి తగ్గుతుంది.
Flex Fuel ఇంజిన్ ఎలా పని చేస్తుంది?
అన్నింటిలో మొదటిది, ఇది సాధారణ అంతర్గత దహన యంత్రం వలె ఉంటుంది, అయితే ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంతో పని చేయగలదు. అనేక సందర్భాల్లో ఈ ఇంజిన్ కోసం మిక్స్ ఇంధనం కూడా ఉపయోగించవచ్చు. సాధారణ భాషలో అర్థం చేసుకుంటే, ఈ ఇంజిన్లో పెట్రోల్ మరియు ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మిక్సర్లోని ఇంధన పరిమాణానికి అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ఫ్యూయల్ మిక్సర్ సెన్సార్ గాను ఉపయోగిస్తుంది. ఫ్లెక్స్ ఇంజిన్లు ఉన్న వాహనాలు ద్వి-ఇంధన ఇంజిన్లు ఉన్న వాహనాలకు భిన్నంగా ఉంటాయి. ద్వి-ఇంధన ఇంజిన్లు వేర్వేరు ట్యాంకులను కలిగి ఉంటాయి, అయితే ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్లలో, మీరు ఒకే ట్యాంక్లో అనేక రకాల ఇంధనాన్ని ఉంచవచ్చు. ఈ ఇంజన్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
ఈ ఇంజిన్ వాహనాలలో పెట్రోల్-డీజిల్ డిజైన్ చేయవలసిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గతంలోనూ చాలాసార్లు పునరుద్ఘాటించారు. ఇథనాల్ ధర లీటరుకు రూ. 60-62 ఉంటుందని, దానిపై ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలు నడుస్తాయని ఆయన గతంలో చెప్పారు. ఈ విధంగా ప్రజలు డీజిల్తో పోలిస్తే లీటరుకు 30 నుండి 40 రూపాయలు ఆదా చేయగలుగుతారు.
వచ్చే రెండేళ్లలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తద్వారా భారత్ తక్కువ చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని నితిన్ గడ్కరీ చెప్పారు. మీరు డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు, ఈ సెన్సార్ ఇథనాల్/మిథనాల్/గ్యాసోలిన్ నిష్పత్తిని లేదా ఇంధనం యొక్క ఆల్కహాల్ గాఢతను గుర్తిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ నియంత్రణ మాడ్యూల్కు సిగ్నల్ను పంపుతుంది. అలాగే ఈ నియంత్రణ మాడ్యూల్ వివిధ ఇంధనాల పంపిణీని నియంత్రిస్తుంది. భారత ఆటోమోటివ్ రంగం టర్నోవర్ 15 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అన్ని వాహన తయారీదారులకు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లను తప్పనిసరి చేసిన తర్వాత కూడా వాహనాల ధరలు పెరగవని గడ్కరీ పేర్కొన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.