ESIC | కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళలకు తీపికబురు అందించింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) స్కీమ్లో చేరిన మహిళలకు (Women) ఊరట కలిగే ప్రకటన చేసింది. మెటర్నిటీ బెనిఫిట్స్ను ఆన్లైన్లోనే పొందే వెసులుబాటు కల్పించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆన్లైన్ మెటర్నిటీ బెనిఫిట్ క్లెయిమ్ ఫెసిలిటీని భుపేంద్ర యాదవ్ ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్లో ఇటీవల జరిగిన దత్తోపంత్ తెంగడి 102వ జయంతి సంస్మరణ సభలో ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన ప్రకటించారు.
రోజుకు రూ.10 ఇచ్చి బంగారం కొనండిలా!
ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు టెక్నాలజీ సాయంలో మెరుగైన సేవలు అందించేందుకు ఈఎస్ఐ శ్రమిస్తోందని ఆయన తెలిపారు. పోర్టల్ ద్వారా లబ్ధిదారులు సులభంగానే ప్రయోజనం పొందొచ్చని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఈ కొత్త సర్వీసులను ఉదాహరణగా చెప్పుకోవచ్చని కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు.
గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు .. ఇవాల్టి రేట్లు ఇలా
మెటర్నిటీ బెనిఫిట్స్ను సులభంగానే పొందొచ్చని, ప్రాసెస్ చాలా సులభతరం అయ్యిందని, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చని ఆయన వివరించారు. మహిళలు ఎక్కడి నుంచైనా ఈ మెటర్నిటీ బెనిఫిట్ కోసం ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదివరకు మహిళలు మెటర్నిటీ బెనిఫిట్స్ పొందాలంటే.. సంబంధిత బ్రాంచ్ ఆఫీస్లకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేదని వివరించారు. ఇప్పుడు ఆ శ్రమ తగ్గిందని వెల్లడించారు.
ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి క్యాష్ రూపంలో పొందొచ్చు. గర్భం దాల్చిన తర్వాత, డెలివరీ తర్వాత, లేదంటే గర్భస్రావం జరిగినప్పుడు నగదు ప్రయోజనం రూపంలో ప్రసూతి ప్రయోజనాలు అందుతాయి. మహిళలు మెటర్నిటీ బెనిఫిట్ కింద 26 వారాల వేతనాన్ని పూర్తిగా పొందొచ్చు. ఈఎస్ఐసీ ఈ పరిహారం అందిస్తుంది. 221-22 ఆర్థిక సంవత్సరంలో 18.69 లక్షల మంది మహిళలకు రూ. 37.37 కోట్ల మెటర్నిటీ బెనిఫిట్ అందించినట్లు ఆయన తెలిపారు.
అందువల్ల మహిళలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఇకపై మెటర్నిటీ బెనిఫిట్ పొందాలని భావించే వారు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్లకు వెళ్లాల్సిన పని లేదు. కాగా నెలకు రూ. 21 వేల వరకు వేతనం పొందే వారు ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే ఉద్యోగులు ఈఎస్ఐ స్కీమ్లో చేరడం వీలు కాదని గుర్తించుకోవాలి. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా చాలా మంది ఈఎస్ఐ కింద ప్రయోజనం పొందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.