కరోనా వైరస్ దెబ్బకు బంగారం ధరలు మండిపోతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.900 పెరిగి రూ.44,472కు చేరుకుంది. ఇప్పటి వరకూ బంగారం పెరిగిన రేటులో ఇదే అత్యంత గరిష్ట స్థాయిలో ఉంది. ఇదిలా ఉంటే బంగారం భారీగా పెరగడం వెనుక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నింపుతోంది. చైనా దాటి కరోనా కేసులు, సౌత్ కొరియా, జపాన్లో నమోదైన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం, వెండి వైపు మరలిస్తున్నారు. ఫలితంగా, అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. అలాగే రూపాయి క్షీణత కూడా బంగారం పెరుగుతున్న మరో కారణం. ఇదిలా ఉంటే న్యూయార్క్ మార్కెట్లో మార్కెట్లో ఔన్స్ బంగారం 1,682 డాలర్లు తాకింది. అటు హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ఏకంగా రూ.43,590గా నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold price down, Gold rate hyderabad, Gold rates, Gold shops