2023లో జరగనున్న తదుపరి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సెషన్కు ముంబై హోస్ట్గా ఎన్నికైంది. IOC సభ్యురాలిగా ఎన్నికైన మొదటి మహిళ అయిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం, భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత (బీజింగ్ 2008, షూటింగ్) అభినవ్ బింద్రా 139వ IOC సందర్భంగా నివేదికను సమర్పించారు. బీజింగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్తో పాటు సెషన్ నిర్వహించబడింది. భారతదేశం యొక్క ఉద్వేగభరితమైన క్రీడాభిమానులతో నిమగ్నమవ్వడానికి ఒలింపిక్ ఉద్యమానికి ఉన్న అపూర్వ అవకాశం గురించి ప్రతినిధి బృందం మాట్లాడింది. నీతా అంబానీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
-భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం మరియు అటువంటి ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఈవెంట్ను నిర్వహించడం పట్ల మా అభిరుచి మరియు ఆశయాన్ని పంచుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు. 1983లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సెషన్కు ఆతిథ్యమిచ్చినప్పటి నుండి భారతదేశం స్థిరమైన పురోగతిని సాధించిందన్నారు. మరింత సంపన్నమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందన్నారు. భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరిస్తోందన్నారు. అసమానమైన వైవిధ్యాలతో కూడిన శక్తివంతమైన దేశమని కొనియాడారు.
-IOCతో ఉన్నటువంటి బలమైన ప్రపంచ సంబంధాలతో భారతదేశం బలమైన ప్రజాస్వామ్యమన్నారు. దేశం అంతటా 1.5 బిలియన్ వ్యాక్సిన్లను అందిస్తోంది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తూ భారతదేశం కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిందన్నారు.
-ఒలింపిక్ ఉద్యమంతో భారతదేశం చాలా ప్రత్యేకమైనదాన్ని సృష్టించే అంచున ఉందని తాను నమ్ముతున్నాన్నారు. ఒలింపిక్ క్రీడతో సహా అన్ని రంగాలలో భారతదేశం కొత్త శిఖరాలను ఎదుగుతోందన్నారు. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, 600 మిలియన్లకు పైగా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఇది అత్యంత కీలకమైన మరియు ఉత్తేజకరంగా మారిందన్నారు.
-ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నుండి ప్రేరణ పొంది, ప్రతిభను గుర్తించడం మరియు క్రీడా ప్రపంచంలో వారిని గొప్పగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అన్నారు. ఒలింపిక్ సెషన్ 2023కి అనుగుణంగా, అణగారిన వర్గాల యువత కోసం ఎలైట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను ప్రారంభించాలని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు.
-భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనేది మా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. భారతదేశంలో 2023లో జరిగే IOC సెషన్ ఈ ఆశయాన్ని అమలులోకి తెచ్చే ఉత్ప్రేరకం అవుతుందన్ని ఆకాంక్షించారు.
-2023 వేసవిలో జరగనున్న సెషన్ ముంబైలోని అత్యాధునిక, సరికొత్త జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడుతుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నగరం నడిబొడ్డున ఉన్న JWC భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ మరియు 2022 ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.