కళాభిమానులకు శుభవార్త. అబిర్ ఇండియా చొరవతో.. ఈసారి మళ్లీ నవంబర్ 12 నుండి 18 వరకు ఢిల్లీలోని బికనీర్ హౌస్లో వార్షిక ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫస్ట్ టెక్ 2022 పేరుతో ఈ ఈవెంట్ని ఆరోసారి నిర్వహిస్తున్నారు. అబిర్ ఇండియా ఇప్పటివరకు 390 నగరాల నుండి ఈ ప్రోగ్రామ్ కోసం మొత్తం 2200 కళలను అందుకుంది. ఫస్ట్ టెక్ 2022లో ఈసారి 148 మంది యువ కళాకారులకు అవకాశం ఇస్తున్నారు. అత్యంత పారద్శకమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో సెలెక్టర్లు ఈ ఆర్ట్ లను ఎంపిక చేశారు.
జ్యూరీ ఎవరంటే?
ఈ షోకు జ్యూరీగా జయరామ్ పొదువాల్, మంజునాథ్ కామత్, మనీషా పరేఖ్, జీ.ఆర్.ఇరానా. రూబీ జాగ్రుత్, వీ రమేశ్ వ్యవహరించారు.
అబిర్ ఇండియా గురించి..
అబిర్ ఇండియా అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఈ సంస్థకు రూబీ జాగృత్ పునాది వేశారు. 2016లో అహ్మదాబాద్లో దీని ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం భారతదేశం అంతటా కళాకారుల కోసం ఈ సంస్థ పని చేస్తోంది. గతంలో ఈ ఆర్ట్ షోను ఢిల్లీలో నిర్వహించగా.. ప్రస్తుతం దీని వేదిక ఢిల్లీకి మారింది. వర్ధమాన కళాకారులు ఈ సంస్థ నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఎంపిక చేసిన కళాకారులలో బెస్ట్ 10 మందికి వారి ప్రతిభ, ఆలోచన, భావవ్యక్తీకరణకు అవార్డులు అందించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.