బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సెక్టార్లో పెరుగుతున్న పోటీ కారణంగా పలు కంపెనీలు తక్కువ ధరకే హైస్పీడ్ డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు బ్రాడ్బ్యాండ్ కంపెనీ ఎక్సైటెల్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. నెలకు కేవలం రూ.399లకే 100 ఎంబీపీఎస్ హైస్పీడ్ డేటాను అందిచే ప్లాన్ను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వంటి సంస్థలు అచ్చం ఇవే ప్రయోజనాలను రూ.499లకు అందిస్తుండగా, ఎక్సైటెల్ మాత్రం రూ.399లకే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఎక్సైటెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) తమ సర్వీసులను ఢిల్లీ ఎన్సిఆర్, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లోనే అందిస్తుంది. ఈ సేవలను దేశమంతటా వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బ్రాడ్బ్యాండ్ కస్టమర్లను పెంచుకోవాలనే లక్ష్యంతో తక్కువ ధరకే హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కేవలం రూ.400లోపు ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ప్రయోజనాలను పరిశీలిద్దాం.
ప్లాన్ ధర, వ్యాలిడిటీ వివరాలు..
ఎక్సైటెల్100 Mbps స్పీడ్ డేటా ప్లాన్ను ఏడాది కాలానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే.. ఒకేసారి రూ.4,788 + 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వినియోగదారుడికి ప్రతినెలా రూ.399 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఇక, ఎక్సైటెల్ 100 ఎంబీపీఎస్ ప్లాన్ వేర్వేరు వ్యాలిడిటీ పీరియడ్లలో కూడా అందుబాటులో ఉంది. 9 నెలలు వ్యాలిడిటీని ఎంచుకునే కొత్త కస్టమర్లు ఇదే ప్లాన్ కోసం రూ .424 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, కొత్త కస్టమర్లు 12 నెలల మొత్తానికి రూ .5,088 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ప్లాన్ మూడు, నాలుగు, ఆరు నెలల వేర్వేరు వ్యాలిడిటీల్లో కూడా లభిస్తుందని ఎక్సైటెల్ పేర్కొంది. 3 నెలల వ్యాలిడిటీని ఎంచుకన్న వారు ప్రతి నెలా రూ .555 ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒకే సారి రూ .1,695 + జిఎస్టిని చెల్లించినా సరిపోతుంది. అదే, 4 నెలలు వ్యాలిడిటీ కోసం ప్రతి నెలా రూ .508 ఖర్చు చేయాలి. లేదంటే ఒకేసారి రూ .2,032+జీఎస్టీ చెల్లించినా సరిపోతుంది. 6 నెలల వ్యాలిడిటీ కోసం ప్రతినెలా రూ .490 ఖర్చు అవుతుంది, అంటే ఒక్కసారి రూ. 2,940+జీఎస్టీ చెల్లించినా సరిపోతుంది. కేవలం ఒక నెల మాత్రమే ఎంచుకుంటే రూ .699+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
సెక్యూరిటీ డిపాజిట్ కింద బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుల నుండి ONU డివైజెస్ కోసం రూ .2,000 వసూలు చేయబడుతుంది. కాని, కంపెనీ దీనికి ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జీలను వసూలు చేయదు. ఫైబర్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై రౌటర్ను కూడా కొనుగోలు చేయడం మంచిదని, తద్వారా ఎక్కువ పరికరాల్లో ఒకేసారి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చని ఎక్సైటెల్ తమ వినియోగదారులను కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business